Sunday, 30 August 2026

మైనర్‌ బాలిక కేసులో బీజేపీ నేతల వైఖరిపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ప్రశ్నలు

 



హైదరాబాద్‌: బీజేపీ నేత బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథపై ఓ మైనర్‌ బాలిక కుటుంబం చేసిన ఫిర్యాదు విషయంలో బీజేపీ నేతల వైఖరిని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. బాలిక, ఆమె కుటుంబసభ్యులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ పోరాటం చేసిందని పేర్కొన్న ఆయన.. అప్పట్లో బండి సంజయ్‌ రాజీనామా చేయాలని రాంచందర్‌రావు ఎందుకు డిమాండ్‌ చేయలేదని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ మహిళా నాయకురాలు కూడా మైనర్‌ బాలికకు మద్దతుగా ఎందుకు నిలబడలేదని నిలదీశారు.

బండి సంజయ్‌ బెదిరించారని బాలిక చెప్పినప్పటికీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ప్రవీణ్‌ కుమార్‌.. బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప తమను బెదిరించారని బాలిక కుటుంబసభ్యులు చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాంచందర్‌రావు ఇప్పుడు బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Featured post

ఒడిశాకు రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

  నేడు ఒడిశాలో అత్యంత భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు, ఉరుములు జమ్మూకశ్మీర్‌, పశ్చిమ మధ్యప్రద...