Tuesday, 18 August 2026

ఖేల్‌రత్నకు ఈసారి ‘నో’.. 17 మందికి అర్జున అవార్డులు




న్యూఢిల్లీ: 2025 సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నను ఎవరికి ప్రకటించలేదు. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు దక్కాయి. అథ్లెటిక్స్‌లో తేజస్విన్‌ శంకర్‌, మహమ్మద్‌ అజ్మల్‌, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌, చెస్‌లో విదిత్‌ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్‌ సహా పలువురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. హాకీలో లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్‌ పాల్‌, కబడ్డీలో సుర్జీత్‌, పూజ, షూటింగ్‌లో అఖిల్‌ షియోరాన్‌, పారా షూటింగ్‌లో ధనుష్‌ శ్రీకాంత్‌, రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌, రోయింగ్‌లో అరవింద్‌ సింగ్‌ తదితరులు అవార్డులు అందుకోనున్నారు. ఫుట్‌బాల్‌లో అరుమై నాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్‌) లభించింది. పలువురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించారు.

No comments:

Post a Comment

Featured post

టెస్టుల్లో 100 సిక్సులు.. భారత తొలి బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ చరిత్ర

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున 100 సిక్స...