Thursday, 13 August 2026

నా ప్రసంగం తర్వాత శుద్ధి చేశారు

 




పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్‌లో తాను పాల్గొన్న ర్యాలీ వేదిక వద్ద తన ప్రసంగం అనంతరం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ర్యాలీలో ఏ వర్గాన్ని, మతాన్ని ప్రస్తావించకుండా ప్రజా సమస్యలపైనే మాట్లాడానని తెలిపారు. అయినప్పటికీ తన ప్రసంగం తర్వాత శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటన వెనుక బీజేపీ కార్యకర్తలు ఉన్నారని ఖర్గే ఆరోపించగా, కాంగ్రెస్‌ ఎంపీలు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి చర్యలను బీజేపీ ఏమాత్రం సమర్థించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.



No comments:

Post a Comment

Featured post

మోడీ, అమిత్ షా రాజీనామా చేసేవరకు నిద్రపోనివ్వం

బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేసేవరకు వారిని నిద్రపోనివ్వమని, దేశ ప్రజ...