Showing posts with label #MamataBanerjee #TMC #TrinamoolCongress #ElectionCommission #ECI #SupremeCourt #TMCRow #PoliticalNews #WestBengalPolitics #MamataBanerjeeNews. Show all posts
Showing posts with label #MamataBanerjee #TMC #TrinamoolCongress #ElectionCommission #ECI #SupremeCourt #TMCRow #PoliticalNews #WestBengalPolitics #MamataBanerjeeNews. Show all posts

Friday, 18 September 2026

టీఎంసీ పేరు, గుర్తుపై ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన మమత



  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం
  • ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తు వినియోగంపై అభ్యంతరం
  • ఉప ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొత్త పేరు, గుర్తు కేటాయించిన ఈసీ


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆ పార్టీ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ వర్గం ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో పాటు సంప్రదాయ ‘పూలు-గడ్డి’ ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాల్‌ చేశారు. టీఎంసీలోని ప్రత్యర్థి వర్గాల మధ్య పార్టీపై నియంత్రణ, పేరు, ఎన్నికల గుర్తు విషయంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో.. అక్టోబర్‌ 6న జరగనున్న ఉప ఎన్నికల కోసం పార్టీ పేరు, గుర్తును గురువారం ఈసీ తాత్కాలికంగా స్తంభింపజేసింది. అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరును, ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తును కేటాయించింది. ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరును, ‘ఎన్వలప్‌’ గుర్తును కేటాయించింది. ఈ ఏర్పాటు అక్టోబర్‌ 6 ఉప ఎన్నికల వరకే వర్తించే తాత్కాలిక చర్యగా ఈసీ నిర్ణయించింది. అసలు పార్టీ పేరు, సంప్రదాయ ఎన్నికల గుర్తుపై ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తమ వర్గానికి అసలు పార్టీ పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తును వినియోగించకుండా ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగారు. తాజా పరిణామంతో టీఎంసీలో కొనసాగుతున్న సంస్థాగత వివాదం న్యాయస్థానానికి చేరింది.

Featured post

బీజేపీ క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేస్తున్న పార్టీ: సాయోని ఘోష్‌

విపక్షాల్లో తీవ్ర గందరగోళం.. ప్రజలకు ప్రస్తుతం నమ్మదగిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అధికార పార్టీ వైపు ఉప ఎన్నికల్లో మొగ్గు సాధారణమే.. ప్రజ...