- దేశభక్తుడైన అధికారికి బాధ్యతలు: ఆచార్య ప్రమోద్ కృష్ణం
షామ్లీ: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయంపై ఆధ్యాత్మికవేత్త ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రశంసలు కురిపించారు. రామమందిరం నిర్వహణకు సంబంధించి మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమించడాన్ని ఆయన స్వాగతించారు.
రామమందిరాన్ని సందర్శించని వారు, ఆలయాన్ని స్వయంగా చూసే అవకాశం పొందని వారు.. ఆలయంలోని ఏర్పాట్లు, నిర్వహణపై వ్యాఖ్యానించే హక్కు లేదని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. ఆలయంలోని వాస్తవ పరిస్థితులు తెలియకుండా విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
జితేంద్ర మిశ్రా వంటి దేశభక్తి కలిగిన అధికారిని సీఈఓగా నియమించడం అభినందనీయమైన నిర్ణయమని ఆయన అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ట్రస్ట్ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
రామమందిరం నిర్మాణం అనంతరం ఆలయ నిర్వహణ, భద్రత, పరిపాలన వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో.. అనుభవజ్ఞుడైన మాజీ సైనిక అధికారికి కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
No comments:
Post a Comment