- వెయ్యి రోజుల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కేపీ వివేకానంద
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవంత్రెడ్డి చిన్నపిల్లాడిలా ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం అయిన తర్వాత రేవంత్రెడ్డికి అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు.
తన పాలనపై రేవంత్రెడ్డికి నిజంగా నమ్మకం ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.
పొన్నం ప్రభాకర్, మహేశ్కుమార్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు తానే భిక్షం వేసినట్లు పదవులు ఇచ్చానని రేవంత్రెడ్డి చెప్పుకోవడం సరికాదని ఆయన అన్నారు. వారంతా మొదటి నుంచీ కాంగ్రెస్లో కొనసాగుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి నాయకులుగా ఎదిగినవారేనని పేర్కొన్నారు.
పదవులు తన జేబులో నుంచి ఇచ్చినట్లుగా రేవంత్రెడ్డి మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని కేపీ వివేకానంద విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు స్పందించని కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
No comments:
Post a Comment