Showing posts with label #PeddiSudarshanReddy #RSPraveenKumar #BRS #CMRevanthReddy #FaheemQureshi #CyberabadPolice #TelanganaPolitics #BRSVsCongress #TelanganaNews. Show all posts
Showing posts with label #PeddiSudarshanReddy #RSPraveenKumar #BRS #CMRevanthReddy #FaheemQureshi #CyberabadPolice #TelanganaPolitics #BRSVsCongress #TelanganaNews. Show all posts

Wednesday, 29 July 2026

సీఎం సన్నిహితుడి వేధింపుల వల్లే పెద్ది కి ఈ పరిస్థితి

  •  తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, కాంగ్రెస్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో నిరూపించేందుకు ఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనమని బీఆర్ఎస్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి ఈ రకమైన తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫహీం ఖురేషీనే ప్రధాన కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం వెనుక ఉన్న వివరాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వివరిస్తూ.. నర్సంపేటకు చెందిన కొందరు స్థానిక వ్యాపారవేత్తలు వాసవి బిల్డర్స్‌కు తమ భూమిని విక్రయించారని, అయితే ఆ భూమిపై ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన ఫహీం ఖురేషీ కన్నుపడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాసవి బిల్డర్స్‌కు చెందిన విజయ్ కుమార్ మరియు ఫహీం ఖురేషీ ఇద్దరూ కలిసి సైబరాబాద్‌లోని 'ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్' (EOW) లో ఒక కేసు నమోదు చేయించారని తెలిపారు. అనంతరం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులతో తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యాపారులను వేధిస్తూ.. ప్రతీ విషయంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఏ విధంగానైనా ఆయనను ఈ కేసులో నిందితుడిగా (అక్యూజ్డ్) చేర్చాలనే కుట్రపూరిత ప్లాన్ నడుస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అక్రమ వేధింపులపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ.. "నా చేతిలో ఏమీ లేదు, ఈ వ్యవహారమంతా ఫహీం ఖురేషీ , ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పర్యవేక్షణలోనే జరుగుతోంది" అని ఆయన చేతులు దులుపుకున్నారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గురుకులాల్లో బెంకర్ బెడ్ల కుంభకోణంపై సుదర్శన్ రెడ్డి గళమెత్తి వాస్తవాలను బయటపెట్టినందుకే, కక్షపూరితంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ స్థాయి వేధింపులకు పాల్పడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు.

Featured post

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం

హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం  నంది, గాయత్రి పంప్ హౌస్‌లలో మోటార్లు షురూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా...