ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలో భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో బుధవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
No comments:
Post a Comment