Sunday, 5 July 2026

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి అడుగు



  • ఓయూ విద్యార్థి జేఏసీతో కేశవరావు భేటీ


హైదరాబాద్:తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలోని కమిటీ.. ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థి జేఏసి నాయకులతో తొలి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమం కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై ఓయూ జేఏసీ నేతల నుండి కమిటీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను సేకరించింది.



No comments:

Post a Comment

Featured post

తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడ...