- ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి
హైదరాబాద్: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కాం
గ్రెస్ శ్రేణులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా క్షేత్రస్థాయిలో చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజాభవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment