Thursday, 2 July 2026

ఉప్పల్‌ భగాయత్‌లో తీవ్ర ఉద్రిక్తత..కవిత అరెస్ట్



హైదరాబాద్:ఉప్పల్ భగాయత్ పరిధిలో తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణసేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన భూపోరాటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బోడుప్పల్ ప్రాంతంలో ఉద్యమకారులతో కలిసి ఆమె గురువారం ఉదయం నిరసన కార్యక్రమానికి దిగారు. అయితే, ఈ ఆందోళన కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి లేదంటూ రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ నిర్మించిన టెంట్లను బలవంతంగా తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో కల్వకుంట్ల కవితకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కవితతో పాటు పలువురు ఉద్యమకారులను అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవిత అరెస్ట్ సమాచారం తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు బొల్లారం పీఎస్ ఎదుట భారీ సంఖ్యలో మోహరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

No comments:

Post a Comment

Featured post

హర్మూజ్ జలసంధిలో దాడిని తట్టుకుని.. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు సురక్షితంగా చేరిన చమురు ట్యాంకర్

భువనేశ్వర్/పారాదీప్:  పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హర్మూజ్ జలసంధిలో అపరిచిత శక్తుల నుంచి తుపాకీ కాల్పుల (Gunfire) దాడిన...