ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు విదేశీ క్యాంపస్
భారతీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్' (IIM) బెంగళూరు ఇండోనేషియాలో తన సరికొత్త ఓవర్సీస్ (విదేశీ) క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయం భారతీయ విద్యా రంగంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని, భారతదేశ సాంప్రదాయ జ్ఞాన సంపదను మరియు విద్యా వ్యవస్థను ప్రపంచీకరించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు.
No comments:
Post a Comment