Tuesday, 7 July 2026

బహ్రెయిన్ డిప్యూటీ పీఎం ఖలీద్‌తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భేటీ



కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉపప్రధాని ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో ఇరు దేశాల మధ్య వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

No comments:

Post a Comment