- శివసేన (యూబీటీ) నేత ప్రియాంకా చతుర్వేది డిమాండ్
ముంబై: అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం వ్యవహారంపై రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పందిస్తూ.. కోట్ల మంది హిందువుల నమ్మకంతో కూడిన రామ్ మందిర్ విరాళాలలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పవిత్రమైన ఆలయ నిధులను దారి మళ్లించిన ఈ 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్'ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం కొద్దిమంది రాజీనామాలతోనో లేదా సిట్ విచారణలతోనో ఈ పాపం కొట్టుకుపోదని, భక్తుల నమ్మకాన్ని కాపాడటానికి ఈ ట్రస్ట్ను రద్దు చేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సరికొత్త పారదర్శక బోర్డును ఏర్పాటు చేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. హిందూ సమాజం సెంటిమెంట్లను వ్యాపారంగా మార్చుకున్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో ప్రతిపక్షాలు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాయని ఆమె హెచ్చరించారు.
No comments:
Post a Comment