హైదరాబాద్: ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. తమ తాజా సర్వేలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోందని తెలిపింది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. వరంగల్ పరిధిలోని 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లియర్ లీడ్లో ఉన్నట్లు పేర్కొంది.
అదేవిధంగా నల్గొండ జిల్లాలో సగం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉందని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. మూడు జిల్లాల్లో పార్టీకి లభిస్తున్న ఆధిక్యతను పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని సంస్థ అంచనా వేసింది.
No comments:
Post a Comment