- తెలంగాణ అసెంబ్లీలో భావోద్వేగ ఘటన
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం తీవ్ర భావోద్వేగ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తనపై, తన తల్లిపై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీవ్ర వ్యాఖ్యలతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పరిణామంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ స్థానానికి, ఆయన కుటుంబానికి అవమానం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన స్పీకర్ పదవిని కించపరిచేలా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
- తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్ పదవికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సభా ప్రాంగణంలో అందరికీ క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానానికి, ఆయన కుటుంబానికి జరిగిన అవమానంపై బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకోవడం తెలంగాణ శాసనసభ చరిత్రలో అరుదైన ఘటనగా అధికార పక్ష సభ్యులు పేర్కొన్నారు. స్పీకర్ కళ్లలో కన్నీళ్లు, తీవ్ర ఆవేదనతో తలవంచిన దృశ్యాలు సభలో భావోద్వేగ వాతావరణానికి దారితీశాయి.
No comments:
Post a Comment