- ఎస్సీఓ సదస్సులో భద్రత, అనుసంధానం, అవకాశాలపై భారత్ ప్రాధాన్యతలు
- సభ్యదేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు
- 25వ వార్షికోత్సవ వేళ 26వ ఎస్సీఓ సదస్సు
బిష్కెక్, ఆగస్టు 30: ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్యదేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న జరగనున్న 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు.
ఎస్సీఓ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. 2017 నుంచి భారత్ ఎస్సీఓలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. సదస్సులో ప్రసంగించనున్న మోదీ.. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే అంశాల్లో భారత్ ప్రాధాన్యతలను వివరించనున్నారు.
సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ దేశాల నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మధ్య ఆసియా సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవంలోనూ మోదీ పాల్గొంటారు.

No comments:
Post a Comment