Tuesday, 18 August 2026

‘వందేమాతరం’ పాడటం నేరమైతే గాంధీ, నెహ్రూపైనా కేసులు పెట్టండి: మల్లికార్జున ఖర్గే

 పనాజీ: ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ పాడిన అదే ‘వందేమాతరం’ పాటనే తాను కూడా పాడానని ఆయన అన్నారు. “‘వందేమాతరం’ పాడటం నేరమైతే, గత 18 ఏళ్లుగా వారు కూడా అదే నేరం చేస్తున్నట్లే. ఇది నేరమైతే గాంధీజీపై కేసు పెట్టండి. నెహ్రూజీపై కేసు పెట్టండి. వల్లభ్‌భాయ్‌ పటేల్‌పై కూడా కేసు పెట్టండి” అని ఖర్గే వ్యాఖ్యానించారు.



దేశానికి ఏ జాతీయ గీతాలు, జాతీయ గేయాలను స్వీకరించాలన్న దానిపై కాంగ్రెస్‌ చాలాకాలం కిందటే ఒక తీర్మానం చేసిందని ఖర్గే గుర్తుచేశారు. “వారు పుట్టకముందే దేశానికి ఏ జాతీయ గీతాలను స్వీకరించాలన్న అంశంపై కాంగ్రెస్‌ తీర్మానం చేసింది. మీరు ఏది చెబితే అదే దేశానికి ప్రమాణం అయిపోదు. రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అది ఏదైనా చెబితే అదే నిబంధనగా మారుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. గత 90 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్నే తాము కొనసాగిస్తున్నామని ఖర్గే స్పష్టం చేశారు. జాతీయ గేయాల విషయంలో చారిత్రకంగా కొనసాగుతున్న విధానాన్ని పక్కనపెట్టి, ప్రస్తుత రాజకీయ పరిణామాల ఆధారంగా కొత్త ప్రమాణాలు నిర్ణయించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment

Featured post

హర్మూజ్‌.. అమెరికాలో కొత్త ప్రదేశం

  మ్యాప్‌ ఫొటోతో ట్రంప్‌ సంచలన పోస్ట్‌ హర్మూజ్‌ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశ...