- రేవంత్ సర్కార్పై గుత్తా సుఖేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనితీరుపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, గ్రూపు తగాదాలను తగ్గించుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గీత దాటే నేతలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే నష్టం కాంగ్రెస్కే జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయాలంటే పాలనలో, మంత్రివర్గంలో మార్పులు అవసరమని గుత్తా అభిప్రాయపడ్డారు. పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉందని, దాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలి
పెన్షన్లను రూ.4,000కు పెంచాలని, రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని గుత్తా డిమాండ్ చేశారు. 22ఏ భూముల బ్లాక్లిస్టును రద్దు చేయాలని కోరారు. అనవసర ఉచిత పథకాలను తగ్గించి.. తెలంగాణ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని సూచించారు.
పార్టీలో, ప్రభుత్వంలో అవసరమైన మార్పులు చేపడితేనే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మార్పులు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment