Tuesday, 4 August 2026

మాదకద్రవ్యాల నియంత్రణకు 27 దేశాలతో ఒప్పందాలు



  • లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో తెలిపారు. యువతను డ్రగ్స్ ముప్పు నుంచి రక్షించేందుకు రాష్ట్ర పోలీసులతో కలిసి నిఘా ఆధారిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం కోసం నాలుగు అంచెల నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంధనం కట్

కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా  దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాద...