Saturday, 19 September 2026

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్



  • దానం నాగేందర్ సంచలన నిర్ణయం

హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే  ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్, దానం నాగేందర్‌ను ఏప్రిల్ 23, 2024 నుండి వర్తించేలా శాసనసభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. అలాగే ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది.  హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పరిణామాన్ని ముందే ఊహించిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు (Stay) ఇవ్వవద్దంటూ సుప్రీంకోర్టులో ముందస్తుగానే 'కేవియట్‌ ' (Caveat) పిటిషన్లను దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.


No comments:

Post a Comment

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...