Saturday, 20 January 2024
అంతా తానే అనుకోవడమే అసలు సమస్య
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ అనర్గళంగా, అర్ధవంతంగా ఆంగ్లం మాట్లాడలేదన్నది చర్చ కాదు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, పెట్టుబడులు పెట్టే వారిని కార్లతో పోల్చడం, ప్రభుత్వాన్ని రోడ్డుతో పోల్చడం, పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆకర్షించడానికి గత ప్రభుత్వం చేసిన పదేళ్ల కృషిని అంగీకరించడానికి ఇష్టపడక ఐటీ రంగాన్ని, వ్యవసాయరంగాన్ని న్యూక్లియర్ ఛైన్ రియాక్షన్ అని సంబంధం లేని సమాధానం చెప్పడం వల్లకదా సీఎంపై సెటైర్లు పేలుతున్నాయి. సీఎం తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా తనకు బాగా తెలిసిన భాషలో చెప్పవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచీ పార్టీలోనూ, ఇప్పుడు ప్రభుత్వంలోనూ అంతా తానే అన్నట్టు వ్యవహరించడం వల్లనే ప్రస్తుత పరిస్థితి కారణం. జ్ఞానాన్ని పంచాలి, అజ్ఞానాన్ని దాచుకోవాలంటారు. దావోస్ పర్యటనలో సీఎం చేసింది ఏమిటి అన్నది భజనపరులు ప్రశ్నించుకుంటే సమాధానం వారికే దొరుకుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
-
అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్...
-
పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి ...
-
నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశం...
No comments:
Post a Comment