Saturday, 20 January 2024
అంతా తానే అనుకోవడమే అసలు సమస్య
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ అనర్గళంగా, అర్ధవంతంగా ఆంగ్లం మాట్లాడలేదన్నది చర్చ కాదు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, పెట్టుబడులు పెట్టే వారిని కార్లతో పోల్చడం, ప్రభుత్వాన్ని రోడ్డుతో పోల్చడం, పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆకర్షించడానికి గత ప్రభుత్వం చేసిన పదేళ్ల కృషిని అంగీకరించడానికి ఇష్టపడక ఐటీ రంగాన్ని, వ్యవసాయరంగాన్ని న్యూక్లియర్ ఛైన్ రియాక్షన్ అని సంబంధం లేని సమాధానం చెప్పడం వల్లకదా సీఎంపై సెటైర్లు పేలుతున్నాయి. సీఎం తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా తనకు బాగా తెలిసిన భాషలో చెప్పవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచీ పార్టీలోనూ, ఇప్పుడు ప్రభుత్వంలోనూ అంతా తానే అన్నట్టు వ్యవహరించడం వల్లనే ప్రస్తుత పరిస్థితి కారణం. జ్ఞానాన్ని పంచాలి, అజ్ఞానాన్ని దాచుకోవాలంటారు. దావోస్ పర్యటనలో సీఎం చేసింది ఏమిటి అన్నది భజనపరులు ప్రశ్నించుకుంటే సమాధానం వారికే దొరుకుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే
https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment