Tuesday, 4 February 2025

రేవంత్‌ సర్కార్‌ ముందున్న సవాళ్లు


కాంగ్రెస్‌ పార్టీ మహా సముద్రం. ఆ పార్టీలోకి నాయకులు వస్తుంటారు. పోతుంటారు. అంతకంటే మఖ్యమైనది ఆపార్టీలో అంతర్గ ప్రజాస్వామ్యం పేరుతో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు అనేది. అందుకే కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ప్రజలు, ప్రతిపక్షాల కంటే కొన్నిరోజులుగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు పది మంది ప్రత్యేక సమావేశం కావడం రాజకీయవర్గాల్లో కలకలకం సృష్టిస్తుండగా.. దేశానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే కులగణన తెలంగాణ మోడల్‌ కాబోతున్నదని గప్పాలు కొట్టారు. దీనిపై బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమౌతున్నది. మొన్నటిదాకా కేసీఆర్‌ పాలన సరిగా లేదు, ఆయన పాలనా విధానాలు సరైనవి కావన్న వాళ్లే ఆయనే కరెక్టు. ఆయన చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతోనే కాంగ్రెస్‌ చేసిన బోగస్‌ సర్వే తేటతెల్లమైందంటున్నారు. అసెంబ్లీలోనూ విపక్షాలు కులగణనపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కడిగిపారేశాయి. చివరికి ముఖ్యమంత్రి సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని,వారికి మైక్‌ ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరడం కొసమెరుపు. 




No comments:

Post a Comment

Featured post

ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?

 తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...