దేవరకొండకు కృష్ణా జలాలు వస్తాయని మా మిత్రుడు బెక్కం వేణు చిన్నప్పటి నుంచి ఎదురుచూస్తున్నాడు. దీంతో మా భూములకు డిమాండ్ పెరుగుతుందని, మంచి పంటలు పండితే మా తలరాతలు మారుతాయని ఆశించాడు. కానీ దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి నీళ్లు అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు వస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారయ్యాయి. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన తీరే పెద్ద కుట్ర అని కేసీఆరే కాదు తెలంగాణ ఇంజినీర్లు అనేకమంది అభిప్రాయం. కానీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేసీఆర్ పదేళ్లు పండబెట్టిన ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని బీరాలు పలికారు. కానీ ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కుప్పకూలింది. అందులో గల్లంతైన 8 మంది ఆచూకీ 48 గంటలైనా జాడలేదు. వాళ్లు సురక్షితంగా బైటికి రావాలని కోరుకుంటున్నారు. కానీ సాంకేతికంగా అనేక సమస్యలతో ముడిపడిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ వాస్తవాలు మాట్లాడితే ఎద్దేవా చేసిన కోమటిరెడ్డి లాంటి వాళ్లకు ఎస్ఎల్బీసీ సొరంగం పైకొప్పు కుప్పకూలిన తర్వాత కూడా అర్థం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులపై అవగాహన లేకపోయినా ఫరవాలేదు. కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడే
కాంగ్రెస్ నేతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment