Saturday 18 September 2021

మార్పు పంజాబ్ లో మొదలై

మొన్నటిదాకా సీఎం లను మార్చుతూ బీజేపీ వార్తల్లో నిలిచింది. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. ఆ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారు.

పంజాబ్‌లో రాజకీయాలు కొంత కాలంగా అనేక పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసేదాకా వచ్చింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిడి చేస్తున్నారు. అధిష్ఠానం రాజీనామా చేయాలని అమరీందర్‌కు సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది.


రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో విసిగిపోయానని, కాబట్టి పదవిలో కొనసాగలేనని సోనియాగాంధీకి  కెప్టెన్ వివరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే రాజీనామా సమర్పించారు. అయితే రాజీనామా అనంతరం మీడియా మాట్లాడిన కెప్టెన్‌ అమరిందర్ సింగ్ దీన్ని అవమానంగా భావిస్తున్నానని అన్నారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను  అన్నారు. అయితే కొంతకాలంగా కెప్టెన్, సిద్ధూ ల మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టింది. అందుకే కెప్టెన్ వ్యతిరేకించినప్పటికి సిద్దూని నియమించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలను కాంగ్రెస్ అధిష్ఠానం ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసే రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి పవర్ ను నిలబెట్టుకోవడం, భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్నచోట ఆయాపార్టీలకు మద్దతు ఇచ్చి బీజేపీని నిలువరించడం వంటి ప్రణాళికలను వ్యూహాత్మక అమలుచేస్తున్నది. జార్ఖండ్ లో ఇదే చేసింది. మహారాష్ట్ర లో ఎన్నికల తర్వాత కొత్త కూటమిలో కాంగ్రెస్ పార్టీనే కీలకం. ఛత్తీస్ గఢ్ లో సీఎం మార్పు పై ఆ పార్టీలో నెలకొన్న విభేదాలకు కూడా త్వరలో ముగింపు ఉండొచ్చు. రాజస్తాన్ లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. పంజాబ్


 లో ప్రస్తుత మార్పు అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టే భావించాలి.


Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home