Saturday 4 September 2021

ఎన్నిక వాయిదాతో ఫాయిదా ఎవరికి?

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు ఈసీ వెల్లడించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం  పేర్కొంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమై ఎన్నికల నిర్వహణ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నది.

హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేడో రేపో షెడ్యూల్ రావొచ్చని, అందుకే దళితబంధు పథకాన్ని హుజురాబాద్ లో కాకుండా వాసాలమర్రిలోనే ముఖ్యమంత్రి ప్రారంభించా రు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా అధికార పార్టీ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆ నియోజకవర్గ నేతలకు కట్టబెట్టింది. నిధులు విడుదల చేసింది. వాగ్దానాలను చేసుకుంటూ పోతున్నది. ఎన్నిక ప్రచార హీట్ ను పెంచింది అధికార పార్టీనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు ఈసీ ఉప ఎన్నిక ను వాయిదా వేసింది. దీంతో నిన్నటి దాకా ఉధృతంగా జరిగిన ఉప ఎన్నిక ప్రచార వాతావరణం చల్లబడనున్నది. 

అయితే ఈ ఉప ఎన్నిక వాయిదాతో ఫాయిదా ఎవరికి?ఎలాగైనా ఈ ఎన్నికలో గెలువాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అన్ని అధికార అస్త్రాలు వినియోగించుకున్నది. అయినా ఎన్నిక ఫలితం ఏకపక్షం కాదన్న విషయం అవగతం అయ్యిందని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట. ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యం అధికార పార్టీ ప్రచారంలో పెట్టినా అక్కడ అమలవుతున్న పథకాలు, పనులు మా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్లు ప్రజలు , ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువగా వస్తున్నది. ఎన్నిక వాయిదా పడటం వల్ల ఈటల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న సానుభూతి తగ్గుతుందా? అధికార పార్టీకి ఈ వాయిదాతో ఫాయిదా ఉంటుందా వేచిచూడాలి.


Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home