Monday, 29 April 2024

కాంగ్రెస్‌లోకి గుత్తా కుమారుడు


ఊహించినట్టుగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 


కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే నేతలు పార్టీ వీడుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు  ముందు కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నేతలు పార్టీ వీడటానికి ఇదే కారణం అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్లనే తన కొడుకు అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నాడని తెలిపారు. అప్పుడే తండ్రి కొడుకులు ఇద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన తనయుడు పార్టీ మారడంతో అదే నిజమైంది.

No comments:

Post a Comment

Featured post

రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే

  https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....