ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. తీహార్ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో కవితను సీబీఐ ప్రశ్నించిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన జైలులో మరోసారి ప్రశ్నించింది. కవితను మరోసారి విచారించడానికి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద సీబీఐ అనుమతి తీసుకున్నది.
https://youtube.com/shorts/gyJ_iGsN3hs?si=82Cv-r4li_4b8VYy
సీబీఐ అరెస్ట్పై కవిత తరఫు న్యాయవాది మోహిత్రావు అత్యవసర విచారణ కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ స్పెషల్ కోర్టులో దరఖాస్తు చేశారు. ప్రత్యేక జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు.
No comments:
Post a Comment