Thursday, 11 April 2024

సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత


ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. తీహార్‌ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో కవితను సీబీఐ ప్రశ్నించిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన జైలులో మరోసారి ప్రశ్నించింది. కవితను మరోసారి విచారించడానికి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద సీబీఐ అనుమతి తీసుకున్నది.

https://youtube.com/shorts/gyJ_iGsN3hs?si=82Cv-r4li_4b8VYy

సీబీఐ అరెస్ట్‌పై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు అత్యవసర విచారణ కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ స్పెషల్‌ కోర్టులో దరఖాస్తు చేశారు. ప్రత్యేక జడ్జి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు అప్లికేషన్‌ దాఖలు చేశారు. 





No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...