Saturday, 31 May 2025
Thursday, 29 May 2025
Wednesday, 28 May 2025
కవిత కొత్త పార్టీ పెడుతాారా?
బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆమె పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయనేది ఈ ఎపిసోడ్ తో తేటతెల్లమైంది. అయితే ఇంత జరుగుతున్నా కేసీఆర్ స్పందించలేదు. పైగా పార్టీ నేతలను కూడా దీనిపై ఎక్కువగా స్పందించవద్దు అన్నారు. కేటీఆర్, హరీశ్, కవిత ఎవరైనా సరే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలి. ఆయనతోనే వారికి ఆ గుర్తింపు. ఆయనను కాదని కొత్త పార్టీ పెట్టినా, తిరుగుబాటు చేసినా గతంలో ఇదేవిధంగా వ్యవహరించిన నేతలకు జరిగిన పరాభవమే వీరికి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ను రాజకీయంగా విభేదించిన వారు కూడా ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్లనే రాష్ట్రం సాధ్యమైందని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు టీ కప్పులో తుపానులా కొట్టుకుపోతాయని భావిస్తున్నారు.
Monday, 26 May 2025
Sunday, 25 May 2025
Friday, 23 May 2025
కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి
‘మా నాయకుడు కేసీఆర్ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
‘‘వరగంల్ సభ తర్వాత రెండు వారాల క్రితం నా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశా. నా అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశా. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తి చేసుకొని అమెరికా నుంచి వచ్చే లోపు లేఖ బహిర్గతం అయింది. దానిపై హంగామా నడుస్తున్నట్టు తెలిసింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్కు రాసిన ఉత్తరం బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి అంతర్గతంగా లేఖలు రాశా. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్ అయింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? నా లేఖ లీక్ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చు.
కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే పార్టీకి నష్టం. మా నాయకుడు కేసీఆర్ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది.కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరముంది. నా తండ్రికి నేను రెగ్యులర్గా లేఖలు రాస్తా. ఇందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నా లేఖ చూసి కాంగ్రెస్, బీజేపీ సంబర పడ్సాలిన పనిలేదు’’ అని కవిత అన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరుతో భారాస అధినేత కేసీఆర్కు ఇటీవల కవిత రాసిన లేఖ బయటికొచ్చింది. ఈ లేఖ రాజకీయ
వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె స్పందించారు.
Tuesday, 20 May 2025
Monday, 19 May 2025
Sunday, 18 May 2025
Saturday, 17 May 2025
Like, Share, Subscribe
అనుకోకుండానే 2007లో జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన నాకు తక్కువ సమయంలోనే లబ్ధ ప్రతిష్టులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచే నా అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకున్నాను. అందులో rajuasari.blogspot.com ద్వారా అనేక ఆర్టికల్స్, విశ్లేషణలు రాశాను. యూట్యూబ్ ద్వారా ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. http://www.youtube.com/@AsariRaju
Friday, 16 May 2025
రాష్ట్రపతి/గవర్నర్కు సుప్రీంకోర్టు కాలపరిమితి విధించవచ్చా?
తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/ గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని తీర్పు ఇచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొన్నది. గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. అధికరణం 143(1) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉన్నది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.
రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఇవే..
1) రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలేమిటి?
2) అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ సలహాకు కట్టుబడి ఉండాలా?
3) అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?
4) అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షకు రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా?
5) రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు, అధికరణం 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా.. అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా?
6) అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?
7) రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలవ్యవధులు లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా?.. అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా?
8) రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా?
9)చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉన్నదా?
10) రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం 142 భర్తీ చేస్తుందా?
11) రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం 200 కింద గవర్నర్ సమ్మతి లేకుండా అమల్లోకి రావొచ్చా?
12) అధికరణం 145 (3) ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కదా?
13) అధికరణం 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్ లాకే పరిమితమా? లేదా అధికరణం 142 కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్స్టాంటివ్ లా లేదా రాజ్యాంగంలోని నిబంధలకు వ్యతిరేకంగా ఉన్నా చెల్లుబాటు అవుతాయా?
14) ఒక్క అధికరణం 131 కింద తప్ప కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధిలను రాజ్యాంగం నిషేధిస్తుందా?
Thursday, 15 May 2025
కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నాం
కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ, కన్న తండ్రి, తోడబుట్టిన వాళ్లు, కుటుంబం మీద కవిత అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని గతంలోనే కవిత అన్న విషయాన్ని గుర్తుచేశారు. తనను జైలులో పెట్టించిన బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడం జీర్ణించుకోలేక బాహాటంగానే కవిత తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సామ విమర్శించారు.
Wednesday, 14 May 2025
Tuesday, 13 May 2025
Monday, 12 May 2025
కాంగ్రెస్ లో కాక పుట్టించిన ఈటల వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అక్కడ సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆయన అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఆ పార్టీ నేతలు అసెంబ్లీ, బయట కౌంటర్ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చారు. వారికి వాదనకు మద్దతుగానే ఈటల రాజేందర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం 2024-25 నాటికీ తెలంగాణ అప్పు రూ. 4.63.583 కోట్లు అని చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్న 7 లక్షల, 8 లక్షల కోట్ల అప్పు ఆరోపణలకు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం, ఆయన వాదనకు బలం చేకూరుస్తున్నది. దీంతో నేడు కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈటలను తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితేబీజేపీ పై ఉన్న ఫ్రస్టేషన్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదన్నారు.బీఆర్ఎస్ తో పంచాయితీ పెట్టుకున్న ఈటల బీజేపీకి వెళ్లి అక్కడ ఇమడలేకపోతున్నారుపార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపోవచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారు. కానీ బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్ కు పరిమితం చేశారు.దీంతో బీజేపీలో తన పరిస్థితి అర్థం కాక పార్టీ హైకమాండ్ వద్ద మంచి మార్కులు కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఈటల విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సీఎంపై ఈటల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటిపై దాడికి ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు ఈటల కులం ఏమిటో చెప్పాలనడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్ కులానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆనాడు మేము సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో కొట్లాడినం. దీనిపై కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మీ లెక్క పదవుల కోసం పెదవులు మూసుకోలేదని విమర్శించారు. మీలా మోకరిల్లిన వాళ్లం కాదన్నారు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం, ఆవేదన ఉంటుందన్నారు. సీఎం నీకు దమ్ముంటే 20- 30 ఏండ్ల కిందట చెరువుల పక్కన కట్టుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ఎల్ఆర్ఎస్ , బీ ఆర్ఎస్ ఉన్నదన్నారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ.. రండలతో ఏం కొట్లాడతాం అన్నారు. మొత్తానికి ఈటల వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక పుట్టించాయి.
Sunday, 11 May 2025
Saturday, 10 May 2025
జాబ్ క్యాలెండర్ అమలు ఎప్పుడు?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన నగదు కూడా లేదంటున్నారు. మరి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అట్టహాసంగా నియామకపత్రాలు అందిస్తున్న వాటిలో ఎక్కువశాతం గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లే అని వారి వాదన. అయితే ప్రభుత్వాలు మారినా నియామక ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వ చెబుతున్న మాట. సరే ఆ సంగతి పక్కనపెడితే గత ఏడాది అసెంబ్లీ వేదికగా ఆగస్టులో
జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. వాటికి సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. కొత్త ఏడాదిలో అప్పుడే 5 నెలలు పూర్తికావొస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలు అంటే జనవరి టు డిసెంబర్ ఉండాలి కదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెట్టి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మరుగున పడేసే ప్లాన్ వేస్తున్నదని మండిపడుతున్నారు.
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న బంధం అగ్రరాజ్యం రాయబారి కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక...






























