‘మా నాయకుడు కేసీఆర్ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
‘‘వరగంల్ సభ తర్వాత రెండు వారాల క్రితం నా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశా. నా అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశా. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తి చేసుకొని అమెరికా నుంచి వచ్చే లోపు లేఖ బహిర్గతం అయింది. దానిపై హంగామా నడుస్తున్నట్టు తెలిసింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్కు రాసిన ఉత్తరం బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి అంతర్గతంగా లేఖలు రాశా. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్ అయింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? నా లేఖ లీక్ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చు.
కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వాటి వల్లే పార్టీకి నష్టం. మా నాయకుడు కేసీఆర్ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది.కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరముంది. నా తండ్రికి నేను రెగ్యులర్గా లేఖలు రాస్తా. ఇందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నా లేఖ చూసి కాంగ్రెస్, బీజేపీ సంబర పడ్సాలిన పనిలేదు’’ అని కవిత అన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరుతో భారాస అధినేత కేసీఆర్కు ఇటీవల కవిత రాసిన లేఖ బయటికొచ్చింది. ఈ లేఖ రాజకీయ
వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె స్పందించారు.
No comments:
Post a Comment