సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లకు పైగా సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంచనా వేసిన విషయం విదితమే. తాజాగా ఆయన చేసిన పోస్టులో తన అంచనాలో ఎలాంటి మార్పు ఉండదనేది ఆ పోస్టు ఉద్దేశంగా కనిపిస్తున్నది.
అలాగే నిరాశలో కూరుకుపోయిన వారికి ఆయన ఒక సలహా ఇచ్చారు. 'జూన్ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి' అనిసెటైర్ వేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్డీఏ 400 మార్క్ దాటుతుందని మోడీ చేస్తు్న్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు. అలాగే 270 కంటే దిగువకూ పడిపోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment