Sunday, 12 May 2024

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?


ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశాయి. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించాక కొంత సానుకూల వ్యక్తమైంది. వైసీపీ కంటే ఆ కూటమి వైపే కొంత ప్రజలు మొగ్గుచూపినట్టు ఆ సర్వే సంస్థలు వెల్లడించిన నివేదిక ఆధారంగా తెలిసింది. అయితే ఎప్పుడైతే బీజేపీ కూటమిలో చేరిందో మొత్తం సీన్‌ మారిపోయిందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌. 


అంతెందుకు మెగా ఫ్యామిలీలోనే మెనీ పార్టీలు అన్నట్టు రెండుమూడు రోజులుగా అక్కడ రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమౌతుంది. అక్కడ ఏపార్టీ గెలుస్తుంది అనే దాని ప్రజలు తేలుస్తారు. కానీ కొన్ని మీడియా సంస్థలు పీకే అభిప్రాయమే ప్రజాభిప్రాయం అన్నట్టు అక్కడ అధికారపార్టీ పని అయిపోయినట్టు, కూటమివైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ-జనసేన ప్రజలకు ఇచ్చిన హామీలకు తమది బాధ్యత కాదన్నట్టు బీజేపీ వ్యవహరిస్తున్నది. 


అలాగే ఏపీ విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందనేది అక్కడ జనాల్లో ఉన్న అభిప్రాయం. అలాంటి బీజేపీ కూటమిలో చేరడం వల్ల టీడీపీ-జనసేనలకు నష్టం జరుగుతుంది కానీ జగన్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదనే వాదన వినిపిస్తున్నది.

No comments:

Post a Comment

Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...