Friday, 17 May 2024

మెట్రో రైలు సమయం పొడిగింపు

 


హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నది. 

అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనున్నది. 

ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సమయాల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన సమయాలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. 


No comments:

Post a Comment

Featured post

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు నేడే పోలింగ్

ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్ను...