రోడ్డుపై గుంతలు.. మహిళ వినూత్న నిరసన


-హైదరాబాద్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే రోడ్డుపై ఓ మహిళ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోని నీటిలో కూర్చుని ఆందోళనకు దిగారు. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో... అటుగా వెళ్తుంటే ప్రమాదానికి గురవుతున్నామని ఆమె వ్యక్తం చేశారు. 

-ఇదే రోడ్డుపై వెళ్తూ తమ పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని వాపోయారు. ఉప్పల్‌ నుంచి నాగోల్‌కు వచ్చేలోపు లెక్కించగా 30 గుంతలు ఉన్నట్టు చెప్పారు. ప్రజలు చెల్లించిన పన్నులు ఏం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీని ఆమె ప్రశ్నించారు. 

-అనంతరం నాగోల్‌ కార్పొరేట్‌, స్థానిక నేతలు జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడటంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు