Thursday, 23 May 2024

రోడ్డుపై గుంతలు.. మహిళ వినూత్న నిరసన


-హైదరాబాద్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే రోడ్డుపై ఓ మహిళ వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోని నీటిలో కూర్చుని ఆందోళనకు దిగారు. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో... అటుగా వెళ్తుంటే ప్రమాదానికి గురవుతున్నామని ఆమె వ్యక్తం చేశారు. 

-ఇదే రోడ్డుపై వెళ్తూ తమ పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని వాపోయారు. ఉప్పల్‌ నుంచి నాగోల్‌కు వచ్చేలోపు లెక్కించగా 30 గుంతలు ఉన్నట్టు చెప్పారు. ప్రజలు చెల్లించిన పన్నులు ఏం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీని ఆమె ప్రశ్నించారు. 

-అనంతరం నాగోల్‌ కార్పొరేట్‌, స్థానిక నేతలు జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడటంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...