ఢిల్లీలో ఎన్డీఏ, ఇండియా ఢీ అంటే ఢీ


- దేశ రాజధాని ఢిల్లీ ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కట్టే ప్రజలు లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరోపార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2019లో ఇక్కడి 7 స్థానాలను కైవసం చేసుకున్న కాషాయపార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి (ఆప్‌) పట్టం కట్టారు. 


- సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ ఏపీ దాడి వంటి ఘటనలు ఆప్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఆర విడుతలో ఢిల్లీలోని 7 నియోజకవర్గాకలు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది. 


- గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన అభ్యర్థులనూ బీజేపీ మార్చి మొత్తం 7 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇక్కడ ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా, ఎన్టీఏ కూటముల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉన్నది. 


- అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్‌, తాగునీరు వంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చే హస్తిన ఓటర్లు లోక్‌సభకు వచ్చేసరికి జాతీయ భద్రత, అభివృద్ధి, ప్రధాని మోడీ సమర్థత వంటి చూస్తున్నారు. ఈసారి ఓటర్లు మద్దతు పలుకుతారంటే మౌనమే సమాధానం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఢిల్లీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే ఉత్కంఠ నెలకొన్నది.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

సెల్ఫ్‌ గోల్‌ సీఎం!