Sunday, 26 May 2024

కోడ్‌ ముగిసిన వెంటనే పోస్టింగులు


- లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

- మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు. 

- కోడ్‌ ముగిసిన వెంటనే వాటినీ ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమైంది. 

- గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టుల ఫలితాలన్నీ వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు మొదలవుతాయి. 

- పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుత నియామక పత్రాలు తీసుకున్న వారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ, ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని సొసైటీలు భావిస్తున్నాయి.

- అందుకే కోడ్‌ ముగిశాక జులై రెండో వారం లోగా ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి.

No comments:

Post a Comment

Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...