బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చు: యోగేంద్ర యాదవ్‌





బీజేపీకి ఈసారి మెజారిటీ రాకపోవచ్చని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్‌ అంచనా వేశారు. దీనికి సంబంధించి ఎక్స్‌ వేదికగా ఆయన ఒక వీడియో పోస్ట్‌ చేశారు. ఆయన మాట్లాడూతూ...

ఈ వీడియో ద్వారా నేను మీకు అణచివేయబడుతున్న, దాచబడిన సత్యాన్ని చెప్పబోతున్నాను.ఈ లోక్‌సభ ఎన్నికలు మలుపు తిరిగిన మాట వాస్తవమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్‌ అన్నారు. తాను కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌,హర్యానా వెళ్లానని చెప్పారు. ఎన్నికలపై పదేహేళ్ల నా అనుభవంతో చెబుతున్నాను. బీజేపీకి మెజారిటీ రాదని చెప్పారు. ఆ పార్టీకి మెజారిటీకి అవసరమైన సీట్లు కూడా రావని, ఎన్డీఏ కూటమికి కూడా 270 సీట్ల కంటే తక్కువే వస్తాయని అంచనా వేశారు. 







2019లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు వస్తే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యపార్టీలకు 353 సీట్లు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 10 సీట్లు, మహారాష్ట్రలో 20, రాజస్థాన్‌, గుజరాత్‌లలో 10, హర్యానా, పంజాబ్‌, చండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీలలో కనీసం 10, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో 15, బీహార్‌లో 15, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో 10 ఇలా బీజేపీ, ఎన్డీఏ కూటమిలోని పార్టీలో 100 సీట్ల వరకు కోల్పోతున్నాయి. మరోవైపు తమిళనాడు, కేరళ, తెలంగాణలో  5 సీట్లు,ఏపీలో 10 ఎన్డీఏకు సీట్లు పెరుగుతాయి. ఇది ఎగ్జిట్‌పోల్స్‌ కావని ఇప్పుడు పరిస్థితి ప్రకారం బీజేపీకికి సొంతంగా 233 వరకు, ఎన్డీఏ కూటమికి  268 సీట్లు రావొచ్చు అని ఆయన అంచనా వేశారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు