Friday, 17 May 2024

ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ ఏర్పాటు


ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ ఏర్పాటైంది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్‌ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి), వి. భూషణం (గుంటూరు రేంజ్‌), వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్‌), రామకృష్ణ (ఏసీబీ), జి.ఎల్‌. శ్రీనివాస్‌(ఏసీబీ) ఉన్నారు.




అంతకుముందు ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీస్‌ ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌  రెండురోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ప్రతి ఘటనలపైనా సిట్‌ ఈసీకి నివేదిక ఇవ్వనున్నది.

No comments:

Post a Comment

Featured post

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక

సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగా...