మీరేమైనా ప్రధాని అభ్యర్థా?: స్మృతి ఇరానీ


బీజేపీ సాధారణ కార్యకర్తతో కాంగ్రెస్‌ కంచుకోటలోనే పోటీపడలేని వ్యక్తి గొప్పలకు పోవడం ఆపాలి. మోడీతో చర్చించడానికి మీరేమైనా 'ఇండియా' కూటమి  ప్రధాని అభ్యర్థా? అని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ప్రశ్నించారు. మోడీ లాంటి వ్యక్తితో చర్చించే స్థాయి ఉందా? ఏ హోదాలో చర్చకు వస్తారని ధ్వజమెత్తారు. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆహ్వానించిన విషయం విదితమే. ఆ చర్చకు తాను కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కానీ రావడానికి సిద్ధమేనని శనివారం వెల్లడించారు. ఇందులో ప్రధాని మోడీ కూడా భాగస్వాములవుతారని ఆశిస్తున్నాను అన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు