Monday 29 April 2024

ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా వెనుక!

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు.లోక్‌సభ ఎన్నికలలో AAPతో పొత్తు పెట్టుకోవడం తన రాజీనామాకు ఒక కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్టు పేర్కొన్నారు.


అరవిందర్ సింగ్ లవ్లీ కన్హయ్య కుమార్ పై విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజీనామా వెనక బీజేపీ ఉన్నదనే వాదనలు ఉన్నాయి.


ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య  కన్నయ్య కుమార్ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఢిల్లీ లోని 7 లోక్ సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన కమల నాథులకు కాంగ్రెస్+ఆప్ అలయెన్స్ సవాల్ విసురుతున్నదని సమాచారం. అందుకే ఇండియా కూటమిలో సంక్షోభం సృష్టించే ఎత్తుగడలో భాగమే తాజా రాజకీయ పరిణామాలు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Labels: , ,

ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

కొవిడ్ కష్టకాలంలో ప్రధాని మోడీ దేశంలో టీకాల తయారీకి అనుమతించి, అందరికీ అందించడంతోనే నేడు భారతీయులంతా బతికున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. కనుక ఆయనను మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు. దీనిపై  విమర్శలు వస్తున్నాయి.


ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అధికారంలో ప్రభుత్వం తన బాధ్యత ను నిర్వర్తించిన దానికి ఇప్పుడు ఓట్లు అడగటం బీజేపీ కే చెల్లింది. లాక్ డౌన్ సమయం లో ఉపాధి పోయి సొంత ఊళ్లకు రవాణా సౌకర్యం లేక వేల కిలోమీటర్లు కాలి బాటన నడిచి మధ్య లోనే కొంత మంది ప్రాణాలు విడిచిన ఉదంతాలు ఉన్నాయి. 

కొవిడ్ సమయం లో చాలా దేశాలు ప్రజల ప్రాణాలను కాపాడటానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఎందుకంటే మానవ వనరుల తోనే ఏ దేశం అయినా పురోగమిస్తుంది ఆ దేశాలు విశ్వసించాయి. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుతో ముడిపెట్టడం సరైంది కాదు. పదేళ్ల తమ పాలన లో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగవచ్చు. కానీ ప్రజల విశ్వాసాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కు వాడుకోవాలని చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఫలితాలే చూడాల్సి ఉంటుంది. 

Labels: , ,

కాంగ్రెస్‌లోకి గుత్తా కుమారుడు


ఊహించినట్టుగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 


కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే నేతలు పార్టీ వీడుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు  ముందు కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నేతలు పార్టీ వీడటానికి ఇదే కారణం అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్లనే తన కొడుకు అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నాడని తెలిపారు. అప్పుడే తండ్రి కొడుకులు ఇద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన తనయుడు పార్టీ మారడంతో అదే నిజమైంది.

Labels: , , ,

కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన ఇండోర్‌ అభ్యర్థి

 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్నారు. మొన్న సూరత్‌ ఏకగ్రీవ ఎన్నిక ఉదంతాన్ని మరిచిపోకముందే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో హస్తంపార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. 


ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశలో భాగంగా మే13న పోలింగ్‌ జరగనున్నది. నామినేషన్ల  విత్‌ డ్రాకు నేడే (ఏప్రిల్ 29) చివరి రోజు. ఈ క్రమంలోనే సోమవారం పొద్దున అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆ వెంటనే బీజేపీలో చేరారు.   ఆ సమయంలో ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ మెండోలా ఉండటం గమనార్హం. 


అక్షయ్‌ బీజేపీలో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ ధృవీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్‌ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లల్వానీ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది పోటీ చేస్తున్నారు. 


ఎన్నికల వేళ బీజేపీ చేస్తున్న రాజకీయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో తేల్చుకోలేక ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం ద్వారా అంతటా బీజేపీ హవా ఉన్నదనే ప్రచారం కల్పించడానికే ఇలాంటివి చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Labels: , ,

Friday 19 April 2024

మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావ్‌ : రేవంత్‌రెడ్డి


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారన్న మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..  'మా ఎమ్మల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. కారు పాడైపోయింది. ఇక షెడ్డు నుంచి బైటికి రాదని ఎద్దేవా చేశారు.' తమ హయాంలో పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామని. కానీ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఈ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా.. బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు.

Labels: , , ,

సార్వత్రిక సమరంలో తొలి విడుత పోలింగ్‌ ప్రారంభం


సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్‌ జరుగుతున్నది. దీనితోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 50  , సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. 60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో జరిగే పోలింగ్‌లో ఇదే పెద్దది. అలాగే కేంద్రంలో బీజేపీ రెండుసార్ల సంపూర్ణ మెజారిటీ సాధించడంలో కీలక రాష్ట్రాలైన యూపీలో 8, రాజస్థాన్‌లో 12 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలోని ముస్లిం, దళిత, ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడుత పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలో ఇవాళ జరుగుతున్న 8 స్థానాల్లో 2019లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకోగా, బీఎస్పీ 3, ఎస్పీ రెండు చోట్ల గెలుపొందాయి. బీజేపీకి సంప్రదాయంగా మొదటి నుంచి మద్దతుగా ఉన్న రాజ్‌పూత్‌లు ఈసారి ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి నెలకొన్నది. అలాగే రాజస్థాన్‌లోని 12 చోట్ల ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నది. 

Labels: , , , , , , , ,

Thursday 18 April 2024

కాంగ్రెస్‌ పార్టీలోకి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే



కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌  వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా ఆ జాబితాలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలిపారు. నేడో, రేపు ఆయన తన అనుచరులతో కలిసి కారు దిగి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. 

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాతే ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్లలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పై పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో వికారాబాద్‌, తాండూరు, పరిగి మినహా మిగిలిన మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి, చెవెళ్ల ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఇప్పుడు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే పార్టీ వీడనుండటంతో ఇంకా ఎంతమంది ఈ జాబితాలో ఉండనున్నారన్న చర్చ జరుగుతున్నది. ప్రకాశ్‌గౌడ్‌ కొన్నిరోజుల కిందటే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనుల విషయంలోనే సీఎంను కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. కానీ నాటి ప్రచారమే నేడు నిజమైంది.

Labels: , , , ,

ఆ నాలుగు స్థానాల ఫలితాలపై ఆసక్తి


రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తి  స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. నాలుగో విడతలో తెలంగాణలోని 17 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల కోలాహలం మొదలైంది. తొలిరోజే 42 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలున్నాయి. ఖమ్మంలోని 10 స్థానాల్లో 9, కరీంనగర్‌లోని 13 స్థానాల్లో (సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్‌ ,కోరుట్ల మినహా) మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం  సాధించింది. అలాంటి ఈ రెండు జిల్లాల అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన పట్నం మహేందర్‌రెడ్డి సతీమణికి మల్కాజ్‌గిరి, రంజిత్‌రెడ్డి చేవెళ్ల, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌, కడియం కావ్యకు వరంగల్‌ టికెట్‌ ఇవ్వడాన్ని సొంతపార్టీలోనే విముఖత వ్యక్తమౌతున్నది. ఈ స్థానాల్లో పార్టీల అభ్యర్థుల కంటే జాతీయ, రాష్ట్ర నాయకత్వమే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకవేళ ఈ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే అది కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Labels: , , , ,

బీజేపీ బలం ఎంత?


అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓట్ల శాతం పెంచుకున్నా ఆశించిన సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో అధికారంలోకి వస్తామని లేదా కింగ్‌ మేకర్‌ అవుతామని చేసిన ప్రచారమూ ఉత్తదేనని తేలిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతామన్న ఆపార్టీకి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే కరువైన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబాబాద్‌ స్థానాలకు బీఆర్‌ఎస్, పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకే టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆపార్టీ గెలిచిన కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఆదిలాబాద్‌ మినహా ముగ్గురినే తిరిగి బరిలోకి దించింది. మల్కాజ్‌గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గతంలో చట్టసభలకు ఎన్నికైన వారే కావడం గమనార్హం. దీంతో మొత్తం 17 స్థానాల్లో ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌, ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులే. దీంతో బీజేపీ బలం ఎంత అన్నది ఫలితాల రోజున తేలనున్నది.

Labels: , , , ,

మోడీ వేవ్ లేదట


 

"పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటర్ల ను బూత్ కు తీసుకుని రావాలి. మోడీ వేవ్ ఉందనే భ్రమ లో ఉండకండి. 2019 లోనూ మోడీ వేవ్ ఉన్నది. కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను." అంటూ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్టు  వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

మహారాష్ట్ర లోని తన సిట్టింగ్ నియోజకవర్గం ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇది తన ప్రత్యర్థి పార్టీలు శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) అస్త్రంగా మారింది.2019 లో ఆమె  ఎన్ సీపీ మద్దతు తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవనీత్ తాజా వ్యాఖ్యల పై స్పందించిన శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ "బీజేపీ నేతలు బహిరంగంగా నిజాలు చెబుతున్నారని " అన్నారు.

Labels: , ,

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం

 

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం


నెలకొంటుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందన్నారు.  తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్‌, ఎన్నికల ఖర్చు చెక్కులను అందించారు. 


ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ...ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్‌ మ్యాప్‌ ఇవాళ ఖారారవుతుంది. కాంగ్రెస్‌ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. రానున్న రోజులు మనవే. పార్లమెంటులో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.

బీ ఫామ్ అంటే...

'బీ' ఫామ్‌ అంటే...



ఎన్నికల సమయం రాగానే పార్టీలు, అభ్యర్థులే కాదు బీ-ఫామ్‌ అంశం కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు తాము స్వతంత్ర అభ్యర్థులగా పోటీ చేస్తున్నామా? ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా? అన్నది నామినేషన్‌ పత్రాల్లో తెలియజేస్తారు. 


గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులకు బీ -ఫామ్‌ ఇస్తుంది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన బీ-ఫామ్‌ను దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును ఆ అభ్యర్థికి కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫామ్‌ను అభ్యర్థికి అందిస్తారు. బీ-ఫామ్‌ ఉంటే  ఒక రాజకీయ పార్టీ ఆ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు లెక్క. దీనివల్ల ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన పార్టీ  అయితే  ఆ పార్టీకి  చెందిన గుర్తుపై అతను పోటీ చేయవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తును వాడుకునే అవకాశం ఉంటుంది.



https://youtube.com/shorts/ajT0b9x11bc?si=BovujaCtCUEqYgzL

Thursday 11 April 2024

సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత


ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. తీహార్‌ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో కవితను సీబీఐ ప్రశ్నించిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన జైలులో మరోసారి ప్రశ్నించింది. కవితను మరోసారి విచారించడానికి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద సీబీఐ అనుమతి తీసుకున్నది.

https://youtube.com/shorts/gyJ_iGsN3hs?si=82Cv-r4li_4b8VYy

సీబీఐ అరెస్ట్‌పై కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు అత్యవసర విచారణ కోరారు. ఈ మేరకు ఆయన సీబీఐ స్పెషల్‌ కోర్టులో దరఖాస్తు చేశారు. ప్రత్యేక జడ్జి మనోజ్‌ కుమార్‌ బెంచ్‌ ముందు అప్లికేషన్‌ దాఖలు చేశారు. 





Labels: , , , ,

మంత్రి మాటల్లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు


అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  ఏం మాట్లాడినా కౌంటర్‌ ఇచ్చారు. అసలు రేవంత్‌ చెప్పేది కాంగ్రెస్‌ పార్టీలో నడువదు అన్నారు. అట్లా ఉప్పూ నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఫలితాల తర్వాత ఒక్కటయ్యారు. ఈ మధ్యకాలంలో బీజేపీ నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కోమటిరెడ్డి బీజేపీలోకి వస్తాననని తమ పార్టీ పెద్దలతో చెప్పినట్టు ఆరోపించారు. దీన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్‌ చేసినా రెండురోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి గేట్లు ఎక్కడివి? బిల్డింగ్‌ ఎక్కడిది? ఉన్న8 సీట్ల ఉన్న ఆపార్టీ ఎక్కడిది అని ఎదురు ప్రశ్నించారు. 


రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఏక్‌నాథ్‌ షిండే ఎవరు అన్న చర్చ జరుగుతున్నది. దీనిపై స్పందించి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... 'కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఎవరూ లేరు. పదేళ్లు రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి బీజేపీనే ఏక్‌నాథ్‌షిండేను సృష్టించిందన్నారు. హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలు నోరు అదుపులోపెట్టుకోవాలని మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా దేనికైనా సిద్ధమని' మంత్రి సవాల్‌ విసిరారు.


రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక అధిష్ఠాన నిర్ణయాన్నికోమటిరెడ్డి బ్రదర్స్‌  బహిరంగంగా వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో పని చేయను అన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్మే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా రేవంత్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డిల జరిగిన మధ్య మాటల యుద్ధం తెలిసిందే. ఆ సమయంలో వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాకుండా తన తమ్ముడి కోసం పనిచేయాలని కార్యకర్తలను, నేతలను కోరినట్టు ఆడియో ఒకటి కలకలం సృష్టించింది., అట్లా రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చారు. రేవంత్‌ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని అంటున్నారు. ఆయనే పదేళ్లు సీఎం అని కొనియాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక  వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో అంటున్నారు. 

Labels: , , , , , , ,

Wednesday 10 April 2024

కంటోన్మెంట్ ఫలితంపై ఆసక్తి


కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారైంది. నివేదిత ను అభ్యర్థిగా ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

స్థానిక నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.


మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ఈ స్థానం ఉన్నది. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితం పై ఆసక్తి నెలకొన్నది. గత ఎన్నికల్లో ప్రధాన పోటీబీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే జరిగింది. బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ ఎస్ అభ్యర్థిగా లాస్య సోదరి నివేదిత పేరు దాదాపు ఖారారు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ఆ పార్టీ ప్రకటించింది. కాషాయ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది.

Labels: , , ,

కడియం కామెంట్స్‌.. బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు



బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. 


గతంలో ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. కాళేశ్వరం ఫీలర్ల కుంగుబాటుపై నిపుణుల సూచనల ప్రకారం మనం ముందుకు వెళ్లాలి. కానీ కేసీఆర్‌ తాను కుర్చీ వేసుకుని మూడు నెలల్లో బాగు చేస్తానని అనడాన్ని తప్పుపట్టారు. 


ఇలాంటివే పార్టీకి నష్టం చేశాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నిర్మాణం లేకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని తాను సూచించానని కానీ దాన్ని కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.


నియోజకవర్గంలో గతంలో మంత్రిగా తాను చేసిన పనులే తప్పా గత పదేళ్ల కాలంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పెద్దగా అభివృద్ధి జరగలేదు అన్నారు. 


బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం పార్టీకి నష్టం చేసిందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఓటర్ల దగ్గరి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. 


కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగింది ఇది కూడా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోవడానికి కారణం అన్నారు. 


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదన్న తానే ఆ పార్టీ చేరడానికి కారణాలు చెబుతూ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనారిటీలపై విపరీతంగా దాడులు పెరిగాయని.. దాన్ని అడ్డుకునే శక్తి ప్రాంతీయపార్టీలకు లేదన్నారు. అందుకే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 


అట్లనే మోడీ ప్రభుత్వం ప్రాంతీయపార్టీలను టార్గెట్‌ చేసిందని, దీంతో ప్రాంతీయపార్టీల మనుగడను ప్రశ్నార్థం చేసిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తే పార్టీ మనుగడ కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


అయితే కేసీఆర్‌ ఫైటర్‌ అని ఆయన ప్రజా సమస్యలపై పోరు చేస్తూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తే పార్టీకి తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.

Labels: , , ,

టెట్‌: నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్‌ అవకాశం


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. 

దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి (ఎడిట్‌ ఆప్షన్‌) ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. 

మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి.

ఈసారి ఫీజులు భారీగా ఉండటంతో దరఖాస్తులు తగ్గాయి. 

వచ్చే నెల 20 వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Labels: , , , , ,

Monday 8 April 2024

జానారెడ్డిని కాదు, రేవంత్‌రెడ్డిని

 https://youtube.com/shorts/4Ankili1zjQ?si=kN8Z7HvRHGADtsWE

Labels: , , , ,

ఎన్నికల తర్వాత ఏక్‌నాథ్‌ షిండే ఎవరు?

https://youtube.com/shorts/jGGjD3n74no?si=h7eAQOeM0eCvPXoJ

Labels: , , , , ,

Monday 12 February 2024

కోమటిరెడ్డి బ్రదర్స్‌ కామెంట్స్‌.. రేవంత్‌రెడ్డికి కౌంటర్స్‌

కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌ పార్టీకి ఎంత బలమో అంతే బలహీనత. వాళ్లు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం. ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రస్‌లోకి వస్తే తీసుకుంటామని అనడం హాస్యస్పదం.  25 మందితో పార్టీ ఫిరాయించాలని  షరతు కూడా పెట్టారు. బీఆర్‌ఎస్‌లో చేరిన పాపాలు కడుక్కోవడానికి ఆయనకు దేవాదాయశాఖ ఇస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, పీసీసీ అధ్యక్షుడు కాదు. కానీ ఏది పడితే అది మాట్లాడుతూ.. హామీ ఇస్తున్నారు. ఆయనే కాంగ్రెస్‌ పార్టీని వీడి, కాషాయ తీర్థం పుచ్చుకుని ఆపార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వ్యక్తి. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరిన ఆయన సమస్యల పై మాట్లాడకుండా ఎంతసేపూ విపక్ష నేతలను పార్టీ మారాలని సూచించడంపై సోషల్‌ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. 


అలాగే మంత్రి వెంకట్‌రెడ్డి కూడా విపక్ష నేతలను ఇరుకున పెట్టాలని ప్రయత్నంచేస్తూ చివరికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇరుకున పడే విధంగా మాట్లాడుతుంటారు. ఇవాళ అసెంబ్లీలోనూ అలాంటి వాదనే చేశారు. కేసీఆర్ సోనియాగాంధీని దేవత అని కొనియాడారు అన్నారు. దీంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందిస్తూ.. మా నేత దేవత అంటే మీ సభా నాయకుడు బలి దేవత అన్నారని ఆ వీడియో ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో ఓ టీవీ ఛానల్ లో వాళ్ల తమ్ముడు పార్టీ ఫిరాయింపు గురించి ప్రశ్నిస్తే మా వాడు ఒక్క పార్టీనే మారాడు. కానీ మా పీసీసీ అధ్యక్షుడు నాలుగు పార్టీలు మారాడని రేవంత్‌పై వ్యంగ్యాస్త్రం వదిలారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కామెంట్లు చూస్తుంటే కాంగ్రెస్‌ను రక్షించబోయి రేవంత్‌ను టార్గెట్‌ చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. 

Labels: , , , , , ,

Sunday 4 February 2024

రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’

 


సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని, ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చాలని, అలాగే.. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా మేము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామన్నారు. దీనిపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అక్కరలేదని మంత్రులు తెలిపారు. అలాగే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఖాళీలపై ఇంకా కసరత్తు జరుగుతున్నదని కచ్చితంగా మేము నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 

రాష్ట్రంలో కుల గణన జరపాలని, కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని, హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించారు. 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్ చేయాలని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించారు. 

Labels: ,

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించాం: సీఎం రేవంత్‌

కేటీఆర్‌, హరీశ్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్‌ పై వేయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించడం జరిగిందన్నారు. 


Labels: , , , , , ,

50-60 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ?

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు మాజీ మంత్రులు  పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనపై చర్చించారు. తొంటి ఎముక విరిగి గాయపడిన కేసీఆర్‌ ఇటీవలే కోలుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లోనే కాదు, ఏపీ, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ పోటీ చేసే అవకాశం ఉన్నది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 50-60 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. 

Labels: , ,

Saturday 3 February 2024

బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లు నిలబెట్టుకోగలదా?

బీజేపీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉన్నదని, కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లు గెలవడం అనుమానమే అన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారాన్ని ఎందుకు కట్టబెట్టారు? బీఆర్‌ఎస్‌ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఆదరించలేదు? బీఆర్‌ఎస్‌ పాలన దేశానికి దిక్సూచీ అని ప్రచారం చేసుకున్నా ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? ఇత్యాది విషయాలపై ఆ పార్టీ సమీక్ష చేసుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలువాలని అంటారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారి పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోయిన విషయంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలం, బలహీనతల గురించి మాట్లాడితే బాగుంటుంది. 


ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. జార్ఖండ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నది. అలాంటి పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని కేటీఆర్‌ ఎలా చెబుతున్నారు? రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్థానిక అంశాలతో ముడిపడి ఉంటాయి. కానీ లోక్‌సభ ఎన్నికలు జాతీయ  అంశాలతో పాటు కూటములపైనే ఆధారపడి ఉంటాయి. అంతెందుకు ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌వర్గం), వాపమక్షాలు ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేటీఆర్‌ మరిచిపోయారా? మమతా బెనర్జీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాని అన్న ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న 9  సీట్లను తిరిగి నిలబెట్టుకుంటుందా? అన్నది కూడా చూడాలి. 

Labels: , ,

రాజయ్య రాజీనామా ఊహించిందే!


 బీఆర్‌ఎస్‌కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు ఆ లేఖను చూపెట్టారు.అంతకు ముందే ఓ మీడియాఛానల్‌తో మాట్లాడుతూ పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అన్నారు. నిజానికి రాజయ్యకు టికెట్‌ నిరాకరించినప్పుడే ఆయన పార్టీ మారుతారని అనుకున్నారు. కానీ పార్టీ మారినా స్టేషన్‌ ఘన్‌పూర్ టికెట్‌ వస్తుందనే విశ్వాసం ఆయనకు లేదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ త్యాగం చేసినందుకు 2023 అక్టోబర్‌ 5న ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రైతుబంధు) ఛైర్మన్‌గా నియమించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే రాజయ్య పదవిలో కొనసాగేవారు. ప్రభుత్వం రాకపోతే తన పదవి పోతుందని తెలుసు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగులను మారుస్తారనే టాక్‌ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వరంగల్‌ సీటును ఆశించారు. కానీ అది కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇస్తారని సమాచారం. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలో రాజయ్య కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2012లో రాష్ట్ర సాధనలో భాగస్వామి కావడం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై ఆరోపణలతో కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న ఎన్నికల్లో ఆయనపై సర్పంచ్‌ నవ్వ చేసిన ఆరోపణ కారణంగా టికెట్‌ నిరాకరించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఆ పార్టీ నుంచి వరంగల్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో తాను 15 ఏళ్ల పాటు పనిచేశానని, ఆ పార్టీలో ఉండే తాను తెలంగాణ కోసం కొట్లాడనని చెప్పుకొచ్చారు. అయితే రాజయ్య రాజీనామా ఊహించిందే!

Labels: , ,

Friday 2 February 2024

కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే అని బెంగాల్‌ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ధైర్యం ఉంటే  యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలని సవాల్‌ విసిరారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 2 సీట్లు ఇస్తామని ప్రతిపాదించాను. కానీ ఎక్కువ సీట్లు కావాలని ఆ పార్టీ కోరడం వల్లనే పొత్తు కుదరలేదన్నారు. ఎన్నికల అనంతరం భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 


దీదీ బాటలోనే ఆప్‌, ఎస్పీ

ఇండియా కూటమిలో కీలకంగా పనిచేసిన మమతాబెనర్జీ తన ప్రతిపాదనలను ఆపార్టీ అంగీకరించేలేదన్న కారణంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీదీ బాటలోనే ఆప్‌ పంజాబ్‌, ఢిల్లీలలో, ఎస్పీ యూపీలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి 11 సీట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. దానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఆమోదించలేదు. అయితే ఇప్పటికే అఖిలేశ్‌ ఆర్‌ఎల్‌డీతో ఒప్పందం చేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ కూడా దూరంగా జరగడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. 

Labels: , , ,

సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ


ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని .మాజీ మంత్రి కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.ఆటోలకు గిరాకీ లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక  15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? అని ప్రశ్నించారు.  ప్రజాభవన్‌ ముందే ఆటో తగలబెట్టినా కనికరించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత డ్రైవర్ల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకోవావాలని వారి పక్షాన కోరుతున్నట్టు, ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటోడ్రైవర్‌కు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజాభవన్‌ అని పేరు మారిస్తేనే సరిపోదన్న కేటీఆర్‌ అది ఆచరణలో చూపెడితేనే ప్రజలు హర్షిస్తారన్నారు. 

Labels: , , , ,

Thursday 1 February 2024

'ఇండియా' కూటమికి కలిసివచ్చే పరిణామాలే ఇవి!


'చావనైనా చస్తాను గానీ బీజేపీతో మళ్లీ కలువను' అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మళ్లీ మాటమార్చారు. ఎన్నడూ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించకున్నా తొమ్మిదోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అవకాశవాద రాజకీయాలే ఆలంభనగా ఆయన సీఎం స్థానాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్నారు. బీహార్‌లో కాంగ్రెస్‌, బీజేపీల ప్రభావం ఉన్నప్పటికీ ఆ పార్టీలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మద్దతుతోనే నితీశ్‌ మాటిమాటికి కూటములు మార్చినా కుర్చీ మాత్రం వదలడం లేదు. సమతా పార్టీ పెట్టిన రెండేళ్లేకే విధేయతను పక్కనపెట్టి నాటి వాజపేయ్‌ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేని కేంద్ర మంత్రి అయ్యారు. 2003లో జనతాదళ్‌ (యూ) పేరుతో వేరే కుంపటి పెట్టుకున్నారు. 2005, 2010లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ బీజేపీకి బైబై చెప్పేశారు. బీజేపీతో ఉన్నంతకాలంలో, తాను సొంతంగా బలపడాలని భావించినంత కాలం ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలపై దుమ్మెత్తిపోశారు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనను ఢీ కొట్టడం తన ఒక్కడి వల్ల కాదని 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాఘట్‌బంధన్‌ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. నితీశ్‌ కూటములు మార్చిన ప్రతిసారి ఆ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి. ఎప్పుడు దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నది ఆయన తాను ఆశించినది దక్కనప్పుడో లేదా బీహార్‌లో తన ప్రాభవం తగ్గుతున్నదని అనుకున్నప్పుడో చేస్తుంటారు. అట్లా 2017లోనే మహాఘట్‌బంధన్‌ వదిలిపెట్టి కమలనాథులతో కలిసి మళ్లీ జట్టు కట్టారు. 2020లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2022లోనే కూటమి మార్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా ఆ కూటమిని కటీఫ్‌ చెప్పి కాషాయపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  


బీజేపీ అవకాశవాదం వల్లనే 

ఆర్జేడీ, కాంగ్రెస్‌ల విషయాన్ని పక్కనపెడితే బీజేపీ బీహార్‌లో, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీ యేతర ప్రభుత్వాలు ఏర్పడకూడదు అన్న ఒకే ఒక కారణంతో అక్కడి ప్రాంతీయపార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి కారణం బీహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో(40+48+26) ఉన్న 114 లోక్‌సభ స్థానాలే లక్ష్యం. యూపీలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇలాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ముఖ్యమే. అందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల వల్ల ప్రగతి కుంటుపడుతున్నదని దుమ్మెత్తిపోసి ఫలితాల అనంతరం అవేపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. బీజేపీ రాజకీయ అవకాశవాదం బీహార్‌లో నితీశ్‌కుమార్‌కు, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌పవార్‌లకు, కర్ణాటకలో కుమారస్వామి వంటి వారికి కూటములు మార్చడానికి దోహదం చేస్తున్నది. బీజేపీకి ఈ రాష్ట్రాల్లో బలం లేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినా, ఇలా  కూలిపోయే ప్రభుత్వాలను నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసినా అర్థం అవుతుంది. 


ఈ పరిణామాలు మంచివే

కేంద్రంలో తాను అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీలను ముందుపెట్టి కాంగ్రెస్‌ను ఖతం చేయడం. తీరా అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతీయపార్టీల్లోనే చిచ్చుపెట్టి చీల్చడం మోడీ-షాలు పదేళ్లుగా అనుసరిస్తున్న విధానాలు. అందుకే ఈసారి ఎలాగైనా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి విపక్షపార్టీలు ఐక్యం అయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చ జరుగుతున్నాయి. యూపీలో ఎస్సీ, ఆర్‌ల్‌డీ, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయనున్నాయి. జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్నది. తమిళనాడులో డీఎంకే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌తోనే కలిసి నడుస్తామని ప్రకటించింది. వామపక్షాలు మొదటి నుంచి బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. లౌకిక స్ఫూర్తిని  కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే 2029లో తాము బలపడవచ్చు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడవచ్చు అనే మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, నితీశ్‌కుమార్‌ వంటి నేతల ఆలోచనలకు అనుగుణంగానే నితీశ్‌ ఆయారాం-గయారాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఇండియా కూటమిలో నెలకొన్న విభేదాలు ఒకంతుకు మంచివే. ఈ కూటమిలోని పార్టీలో కేంద్ర ప్రభుత్వానికే కాదు ఇంకా ఎవరితో పోరాడాలన్న స్పష్టత వచ్చింది. ప్రస్తుత రాజకీయా పరిణామాలకు అనుగుణంగా ఇండియా కూటమి తగిన ప్రణాళికన రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ ఆడే ఆటలో పావులుగా మారుతున్న అవకాశవాద పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తున్నారు.

Labels: ,

నాడు లేవనెత్తిన అంశాలే నేడు ప్రతిబంధకమవుతాయా?


బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను 2023 జూలై 31న మంత్రివర్గం సిఫార్సు చేసింది. వీళ్లద్దరూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని, ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేదన్న వంటి సాంకేతిక కారణాలతో గవర్నర్‌ తమిళిసై వీరిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన ప్రకారం సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యం లేదా ఆచరణాత్మక అనుభవం వీళ్లిద్దరికిలేదని అందుకే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నామని గవర్నర్‌ 2023 సెప్టెంబర్‌ 25 ప్రకటించారు. 


రాజ్యాంగంలో సెక్షన్‌ 171(5) లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యం, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని ఆ సందర్భంగా గవర్నర్‌ పేర్కొన్నారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్‌ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు కూడా నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు విరుద్ధమన్నారు. ఇకపై సెక్షన్‌ 171 (5) కింద నామినేట్‌ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి విజ్ఞప్తి చేశారు. 


గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌,నత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసుపై వాదోపవాదాలు జరిగాయి.  ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నది.కేసు విచరణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎంపిక చేసింది. తమ కేసు తేలేవరకు కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం విదితమే. 


నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నామినేట్‌ చేసిన అభ్యర్థుల అర్హతలపై గవర్నర్‌ లేవనెత్తిన అంశాలే ప్రస్తుతం ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు వర్తిస్తాయని ఆ పార్టీ నేతల వాదన. ఎందుకంటే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని తెలిపిన గవర్నర్‌ మరి కోదండరామ్‌ అయితే ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. నాటి ప్రభుత్వ సిఫార్సులను పక్కనపెట్టడానికి గవర్నర్‌ లేవనెత్తిన అంశాలు ప్రస్తుతం కొత్తగా నియామకమైన ఎమ్మెల్సీలకు ప్రతిబంధకంగా మారాయా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Labels: , , , ,

పొంగులేటి వ్యాఖ్యలతో టీడీపీకి లాభమా? నష్టమా?



తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపడం వల్లనే ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో టీడీపీ స్థాపించారో నారా చంద్రబాబు నాయుడు దానికి ఎన్నడో తిలోదకాలిచ్చారన్నది ఆయన అభిమానుల వాదన. అందుకే ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆపార్టీలో చేరిన వారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారంతా అభిమాన నాయకుడి ఆశయాల మేరకే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టిన ఉద్దేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. పొంగులేటి వ్యాఖ్యల వల్ల ఏపీలో టీడీపీ లాభమా? నష్టమా? అన్న చర్చ జరుగుతున్నది. 


అలాగే తెలంగాణలో వలె ఏపీలోనూ టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందా? లేదా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున టీడీపీకి ఆ పార్టీ మద్దతు ఇస్తుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వద్ద ఉండదు. దీనిపై స్పందించడానికి టీడీపీ సిద్ధంగా ఉండదు. మరో ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విస్మరించిన అంశాల పరిష్కారం కోసం కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేశారు. అంతేగాని టీడీపీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగాని, ఆ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆ పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టుగాని అధికారికంగా ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటులో ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ సీటు గెలుచుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతున్నది. 


పొంగులేటి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ  అభిప్రాయమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఒకవేళ పొంగులేటి వ్యాఖ్యలు నిజమైతే ఏపీలో టీడీపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందని అక్కడ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి ఈ విషయాన్నే అధికార వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  వ్యాఖ్యల వల్ల టీడీపీకి లబ్ధి జరుగుతుందో లేదో తెలియదు. కానీ విమర్శలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అక్కడి రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Labels: , , , ,

Sunday 28 January 2024

కూటమిలో విభేదాలు.. ఒంటరి పోరుకు సిద్ధపడుతున్న పార్టీలు

 


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎవరి దారి అవి చూస్తుకుంటున్నాయి. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల అనంతరమే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మమతా ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన కొద్దీసేపటికే పంజాబ్‌లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ  రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్‌ వెల్లడించారు. పంజాబ్‌లోని 13 నియోజకవర్గాల్లోనూ ఆప్‌ బరిలోకి దిగుతుందన్నారు. దీనికోసం 40 మంది అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేశాం. సర్వే చేసిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. ఆప్‌ పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధపడింది అంటే ఢిల్లీలోనూ ఆపార్టీ అదే విధానాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు తెలియకుండా భగవంత్‌మాన్ ఆ ప్రకటన చేయలేరు. 


ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్‌ పార్టీ సంప్రదింపులు చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మొదటి నుంచి ఒకటే ప్రతిపాదన చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 300 స్థానాల్లోనే పోటీ చేయాలని, బెంగాల్‌లో తనకు, పంజాబ్‌, ఢిల్లీలో కేజ్రీవాల్ కు, యూపీలో అఖిలేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ క్రమంలో బెంగాలోని 42 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి 2 సీట్లు మాత్రమే ఇవ్వాలని టీఎంసీ భావించింది. దీనికి కాంగ్రెస్‌ పార్టీ నిరాకరించింది. అలాగే ఈ విషయంపైనే కాంగ్రెస్‌, టీఎంసీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే  ఆ రాష్ట్ర  కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదర్‌  'ఆమె అవకాశవాది అని, మమతా సహాయంతో మేము ఎన్నికల్లో పోటీ చేయం . సొంతంగా పోటీ చేయడం ఏమిటో మా పార్టీకి తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ సహకారంతోనే మమతా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలి' అని మమతా బెనర్జీపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అధీర్‌ వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. 'మమత తనకు అత్యంత ఆత్మీయురాలని, మా వాళ్లు కొన్నిసార్లు ఏదోఏదో మాట్లాడుతుంటారు. వాటిని  పట్టించుకోవాల్సిన పనిలేదని' సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధీర్‌ రంజన్‌ మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేయడం ఇవ్వాల కొత్తకాదు. కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను కట్టడి చేయలేదు. ఫలితంగా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు మమత లేకుండా ఇండియా కూటమిని ఊహించలేని ఆ పార్టీ అంటున్నది. కానీ ఎస్పీ, టీఎంసీ, ఆప్‌లు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వంతో సఖ్యతతోనే ఉంటున్నా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుల వ్యవహారశైలి వల్ల ఆ పార్టీలు కాంగ్రెస్‌కు దూరంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ కమల్‌నాథ్‌ వ్యవహారశైలి వల్లనే ఎస్పీ, కాంగ్రెస్‌ పొత్తు కుదరలేదు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధే పరోక్షంగా ప్రస్తావించారు. 


కేంద్రంలో బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం కూటమిలోని భాగస్వాములతో సీట్ల సర్దుబాటుపై సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నది. సాధ్యమైనంత వరకు ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట సీట్ల త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నది. కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాల దూకుడు చర్యల వల్ల పొత్తులకు విఘాతం కలుగుతున్నది. బీజేపీ కోరుకుంటున్నట్టే కొంతమంది కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇండియా కూటమిలో విభేదాలకు ప్రాంతీయ పార్టీల కారణం ఎంతున్నదో అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతల వ్యాఖ్యలే కారణమన్నది ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. నిజానికి బీజేపీ నేరుగా ఎదుర్కొని అధికారంలోకి రాగలిగే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికైతే లేదు. ఎందుకంటే యూపీ, బెంగాల్‌, పంజాబ్‌, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుని వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేస్తే త్రిముఖ పోరులో అంతిమంగా కాషాయపార్టీ లబ్ధి పొందుతున్నదని గత రెండు సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తేలింది. ఇండియా కూటమి ఛైర్మన్‌గా  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే‌నే ఎన్నుకున్నాయి. దీంతో కూటమిలో విభేదాలు పరిష్కరించడం, సీట్ల సర్దుబాటుపై ఆపార్టీ పైనే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులు ఏది పడితే అది మాట్లాడటం వల్ల కూటమి లోని పార్టీలో ఒక్కొక్కటిగా సొంతంగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, ఆప్‌లు  నిర్ణయానికి వచ్చాయి.  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నాటికి కూటమిలో విభేదాలు పరిష్కరించుకుని, సీట్ల సర్దుబాటుపై అన్నిపార్టీలు ఒక అభిప్రాయానికి రావాలి. దానికి కాంగ్రెస్‌ పార్టీనే కృషి చేయాలి. అప్పుడే బీజేపీని నిలువరించడం సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కూటమిలోని పార్టీలు ఒంటరిగా వెళ్తే నష్టం జరుగుతుందని అంటున్నారు. 

Labels: , , ,

ఆ ముగ్గురికి ప్రధాని పదవిపై ఆశ


బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా 'ఇండియా' కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బెంగాల్‌, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లలో దీదీ ఇప్పటికే యూటర్న్‌ తీసుకున్నారు. నితీశ్‌ కూడా అదే బాటలో నడుస్తారని టాక్‌.  ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అధినేత నేతలలో మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వీళ్ల ముగ్గురికి ప్రధాని పదవిపై ఆశ ఉన్నది.   తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు గాని కేంద్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. వాళ్ల రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం అని వాళ్లు అనేకసార్లు చెప్పారు. అలాగే కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వీళ్ల అభిప్రాయం. అందుకే వాళ్లు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడువాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌,ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ లాంటి వాళ్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లే.  కేంద్రం మంత్రులుగా వాళ్లు తమ పనితీరుతో ఆకట్టుకున్నవాళ్లే. 


నితీశ్‌ కోరిక అదే

కానీ నితీశ్‌ కుమార్‌ వీళ్లలా కాదు. అధికారం కోసం అన్ని ఎన్ని ఫీట్లు అయినా వేస్తారు అనడానికి ఆయన వ్యవహారశైలినే ఉదాహరణ. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తర్వాత బీజేపీతో మరోసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో, మళ్లీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. ఎనిమిదిసార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయనకు కేంద్రంలో ప్రధాని పదవిపై చేపట్టాలనే ఆకాంక్ష ఉన్నది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీలను ఏకం చేసే సమయంలో ఇదే  అంశంపై ఆయనను ప్రశ్నిస్తే తనకు ప్రధాని పదవిపై ఆశ లేదన్నారు. కానీ ఇండియా కూటమికి తానే నాయకత్వం వహించాలని భావించారు. కానీ మిగతా పక్షాలు ఖర్గేను ప్రతిపాదించగా.. కన్వీనర్‌ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన టార్గెట్‌ ప్రధాని పదవి. అందుకే ఆయన తనకు తాను ఆశించిన పదవి దక్కని చోట ఉండటం ఎందుకు అన్న ఆలోచనతోనే మరోసారి ఆయన కాషాయపార్టీవైపు చూస్తున్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికైతే నితీశ్‌ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతారు అన్నది అధికారికంగా వెల్లడికాకున్నా.. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఆయన ఒంటరిగా పోటీ చేయడమో లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడమో ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. 


మమతకు ఆలోచన అదే

ఇండియా కూటమిలో తాను కొనసాగాలంటే బెంగాల్‌ బాధ్యతలు తనకే అప్పగించాలని ఆమె స్పష్టం చేశారు. 'దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయాలని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా ఉన్నాయి. అవి మిగతా సీట్లలో పోటీ చేస్తాయి. అయితే బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ జోక్యాన్ని మేం అనుమతించబోమన్నారు. విపక్ష కూటమికి మేం కట్టుబడే ఉన్నాయం. జాతీయస్థాయిలో కూటమి భాగస్వామిగా మేం మా వ్యూహాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. విపక్షాలంటే ఏ ఒక్క పార్టీకి చెందినవో కావు. మేమంతా ఐక్యంగా ఉండి, బీజేపీని ఓడించడానికి ఏం చేయాలో అది చేస్తామని' అన్నారు. దీనికి వామపక్షాలు, బెంగాల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు అంగీరించే పరిస్థితి లేదు. అంతేకాదుబెంగాల్‌లో కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ సీపీఎంను కలుపుకని వెళ్తే కేరళ, బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ వారికి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అది లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి విజయానికి దోహదపడుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచన. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై మమత నిర్ణయం ఫలించదని తెలుసు. అందుకే ముందుగానే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల ఫలితాల అనంతరం మా వ్యూహాన్ని నిర్ణయిస్తామనడం వెనుక గతంలో ప్రాంతీయపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు దేవెగౌడ ప్రధాని అయిన విషయం విదితమే. అలాంటి ఒప్పందాన్నే ఇప్పుడు ఇండియా కూటమికి దూరంగా జరుగుతున్న ముఖ్యంగా నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ల మధ్య పరోక్ష అంగీకారం అయి ఉంటుంది.  


అరవింద్‌ కేజ్రీవాల్‌ అడుగులు క్లీయర్‌

నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ వలె కాకుండా అరవింద్‌ కేజ్రీవాల్‌ క్లియర్‌గానే ఉన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన తనపార్టీని విస్తరించే పనిని చాలా ఏళ్ల కిందటే మొదలుపెట్టారు.  గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా పంజాబ్‌లో మాత్రం ఆయన వ్యూహాలు ఫలించాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వీలైనంత ఎక్కువస్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు.  అందుకే ముందుగా పంజాబ్‌, ఢిల్లీ బాధ్యతలు తనకే ఇవ్వాలని మమతా ద్వారా చెప్పించారు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని తమ అధిష్ఠానానికి సూచించింది. దీంతో దీదీ బాటలోనే పంజాబ్‌, ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్‌ నిర్ణయించింది. కేజ్రీవాల్‌ కూడా ప్రధాని పదవి చేపట్టాలని ఉన్నది. అందుకే  ఆయన వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించి అక్కడ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి నమూనాను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన అంతిమ లక్ష్యంగా ప్రధాని పదవే. బహుశా ఎన్నికల ఫలితాల అనంతరం తమ  నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పే అవకాశాలున్నాయి. 


కాంగ్రెస్‌ ముందున్న లక్ష్యం


కూటమి ప్రతిపాదనలకు విరుద్ధంగా వెళ్లాలనుకునే వారితో సంప్రదింపులు, సీట్ల సర్దుబాటు చర్చల జరిపే కంటే కలిసి వచ్చేవారిని, సర్దుకుపోయే పార్టీలతో కలిసి నడిస్తే ఫలితం ఉండొచ్చు అనే వాదన ఉన్నది. పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా త్వరగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలి. దానికి సమయం ఎక్కువ లేదు. ఎంత త్వరగా దీనిపై తుది నిర్ణయానికి వచ్చి ఇండియా కూటమి కామన్‌ అజెండా, కార్యాచరణ ప్రకటించిన ప్రచారం మొదలుపెట్టడం మేలనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

Labels: , , , ,

బీజేపీ రాజకీయాలకు బలయ్యేది ఎవరు?


బీహార్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జేడీయూ-ఆర్జేడీ కూటమి కూలిపోయి బీజేపీ-జేడీయూ కొత్త ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనున్నదనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ బీహార్ లో సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ (74) జేడీయూ (43),హిందుస్థానీ అవామీ మోర్చా (4), వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (4), లోక్‌జన్‌శక్తి పార్టీకి ఒక్క స్థానం ఉన్నది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ఈ పార్టీలన్నీ కలిస్తే 126 అవుతుంది. అధిష్ఠానం, నితీశ్‌కుమార్‌ ఆలోచనలు ఎలా రాష్ట్రంలోల మాత్రం భిన్నపరిస్థితులున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ రాజకీయాల్లో ఎవరికీ శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని చెప్పినా ఆపార్టీలోని కొందరు నేతలు మాత్రం నితీశ్‌ రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం కోసం నితీశ్‌ వ్యవహారశైలి వల్ల ఆయన పూర్తిగా బలహీనపడిపోయారన్నది వారి వాదన. బీజేపీ, జేడీయూల సంగతి పక్కనపెడితే చిన్నపార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ప్రశ్న. 


బీజేపీ-జేడీయూ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నితీశే సీఎం. దీనికి ప్రతిగా రాష్ట్రంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి నితీశ్‌కుమార్‌ అంగీకరించినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ కలిసి పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీఏ 39 గెలచుకున్నది. అందులో బీజేపీ 17, జేడీయూ 16, లోక్‌జనశక్తికి 6 సీట్లు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీకి కూడా లోక్‌సభ సీట్లే కావాలి. అలాగే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాలే ఉండాలన్నది ఆపార్టీ పెద్దల భావన. అందుకే బీజేపీ యేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి పదేళ్లుగా ఆపార్టీ చేసిన ప్రయత్నాలు తెలిసిందే. తాజాగా కూడా మరోసారి ఆ ప్రయత్నాన్ని చేయనున్నది. ఎందుకంటే ఇండియా కూటమి కంటే బీహార్‌లో మహాఘట్‌బంధన్‌ కలిసి పోటీ చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్‌ చేస్తాయని బీజేపీ హైకమాండ్ అంచనా. అందుకే అక్కడ ఆ కూటమిని బద్దలు కొట్టి బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదివారమే గవర్నర్‌ను కలిసి బీజేపీ-జేడీయూ ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 'కూటమి నుంచి నితీశ్‌ విడిపోతే మా తలుపులు తెరుస్తాం. మాకూ మెజారిటీ ఉన్నది' అన్న ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్‌ను మళ్లీ సీఎం కాకుండా చిన్నపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ సన్నాహాకాలు చేస్తున్నది. 


 

ప్రస్తుతం ఆర్జేడీకి (75), కాంగ్రెస్‌కు (19)మంది శాసనభ్యులున్నారు. వీళ్లిద్దరు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటునకు ఇంకా 28 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏలోకి నితీశ్‌రాకను హిందుస్థానీ అవామీ మోర్చా అధ్యక్షుడు జీతన్‌ రాం మాంఝీ,లోక్‌జన్‌శక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మాంజీ పార్టీకి నాలుగు సీట్లు, ఎల్‌జేపీకి ఒక్క సీటు ఉన్నది. అలాగే  సీపీఐ (ఎంఎల్‌) ఎల్‌ (12), ఎంఐఎం (5) సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లున్నాయి. బీఎస్పీ తరఫున ఒకరు,స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు విజయం సాధించారు. ఆర్జేడీ అధినేత చిన్నపార్టీలతో సంప్రదింపులు జరుతున్నారని సమాచారం. అలాగే నితీశ్‌ వైఖరి పట్ల జేడీయూలోని కొంతమంది, బీజేపీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, బలనిరూపణ సమయంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం సీటు కోసం  ఆర్జేడీ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నందున బీహార్‌లో చివరికి ఏం జరుగుతుంది?బీజేపీ రాజకీయాలకు ఎవరు బలవుతారన్నది చూడాలి. ఇండియా కూటమిలో ప్రధాన్యం దక్కలేదని అలబూనిన నితీశ్‌కు రాష్ట్రంలోనూ ఉన్న పదవి తిరిగి దక్కుతుందా? లేక రెంటికి చెడ్డ రేవడి అవుతారా? అన్నది త్వరలో తేలనున్నది.

Labels: , , , , ,

Saturday 20 January 2024

ఉచిత ప్రయాణంపై ప్రజలు ఏమనుకుంటున్నారు?




కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటి కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తామన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఆపార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం దృష్టికి వచ్చే ఉంటాయి. ఫ్రీ బస్సు వల్ల కండక్టర్లు మహిళా ప్రయాణికుల మధ్య  ఘర్షణ నిత్యకృత్యంగా మారాయి. ఈ ఉచిత ప్రయాణానికి అర్హతలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దాన్ని కండక్టర్లు అమలు చేస్తున్నారు. ఆధార్‌ వంటివి చూపెట్టాలనే నిబంధన ఉన్నది. అదీ కూడా అప్‌డేట్‌ చేసుకుని ఉండాలని పేర్కొన్నది. కానీ కొంతమంది అప్‌డేట్‌ చేసుకోకుండా తాము చేసుకున్నామని, ఇంకా కొత్త కార్డు ఇవ్వలేదని, కావాలంటే ఆన్‌లైన్‌లో చూసుకోవాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనల మేరకు లేకపోతే మా అధికారులకు నేను సంజాషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, తాను బాధ్యత వహించాలని కండకర్లు చెబుతున్నారు. నిబంధనలమేరకు ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోకపోతే టికెట్‌ తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రయాణీకులు అందుకు అంగీకరించడం లేదు.  దీంతో ఒకానొక సమయంలో కండక్టరే బస్సు దిగిపోతానని అని అంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఆర్టీసీ మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తాయి అంటున్నారు. ఉచిత ప్రయాణం విషయంలో ప్రతిపక్షాలు, అధికారపక్షాల వాదనల సంగతి పక్కనపెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదే ప్రధానం కావాలి. 

Labels: , , , , ,

అంతా తానే అనుకోవడమే అసలు సమస్య


దావోస్‌ పర్యటనలో సీఎం రేవంత్‌ అనర్గళంగా, అర్ధవంతంగా ఆంగ్లం మాట్లాడలేదన్నది చర్చ కాదు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, పెట్టుబడులు పెట్టే వారిని కార్లతో పోల్చడం, ప్రభుత్వాన్ని రోడ్డుతో పోల్చడం, పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆకర్షించడానికి  గత ప్రభుత్వం చేసిన పదేళ్ల కృషిని అంగీకరించడానికి ఇష్టపడక ఐటీ రంగాన్ని, వ్యవసాయరంగాన్ని న్యూక్లియర్‌ ఛైన్‌ రియాక్షన్‌ అని సంబంధం లేని సమాధానం చెప్పడం వల్లకదా సీఎంపై సెటైర్లు పేలుతున్నాయి. సీఎం తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా తనకు బాగా తెలిసిన భాషలో చెప్పవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి మొదటి నుంచీ పార్టీలోనూ, ఇప్పుడు ప్రభుత్వంలోనూ అంతా తానే అన్నట్టు వ్యవహరించడం వల్లనే ప్రస్తుత పరిస్థితి కారణం. జ్ఞానాన్ని పంచాలి, అజ్ఞానాన్ని దాచుకోవాలంటారు. దావోస్‌ పర్యటనలో సీఎం చేసింది ఏమిటి అన్నది భజనపరులు ప్రశ్నించుకుంటే సమాధానం వారికే దొరుకుతుంది.

Labels: , , ,

Saturday 13 January 2024

ఏపీలో సిట్టింగ్‌ల మార్పుతో 'ఫ్యాన్‌' గాలి వీస్తుందా?


అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణలో ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. సిట్టింగులను మార్చి ఉంటే తెలంగాణలో ఫలితాలు వేరేలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అంటే ఆ అభ్యర్థికే దాదాపు అసెంబ్లీ టికెట్‌ ఖారారు అయినట్టు భావించాలి. జగన్‌ సుమారు 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీని వీడిన వాళ్లలో ఎక్కువ శాతం మంది అయితే జనసేన లేదా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాల్సిందే. ఎందుకంటే  టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రకటించాయి. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఏమైనా రాజకీయ పరిణామాలు మారొచ్చు అంటున్నారు. అదే జరిగితే జనసేనతో బీజేపీ జట్టుకట్టే అవకాశాలున్నాయి. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌ పురంధేశ్వరీ కూడా ఇప్పటికైతే జనసేనతో తమ పార్టీకి పొత్తు కొనసాగుతున్నది. పొత్తులపై తమ పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు. 


పదేళ్ల కేంద్ర ప్రభుత్వం, విభజన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైసీపీలు ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నది వాస్తవం. ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకం కానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నది. నాటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వంతో పాటు వాటిని సాధించడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయి అన్నది ఆ పార్టీ విమర్శ. కాబట్టి ఏపీ ఎన్నికల తీర్పు ఈసారి ఏకపక్షంగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 'వోటా' సర్వే సంస్థ రెండు నెలలుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ సంస్థ సీఈవో కంభాలపల్లి కృష్ణ కూడా ఏపీలో ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంటున్నారు. దాదాపు 50 మంది సిట్టింగులను మార్చడం వల్ల వైసీపీ అందులో సగానికి పైగా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ మార్చకుండా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే జగన్‌ నష్టనివారణ చర్యలో భాగంగానే చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికల నాటికి ఏపీలో ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

Labels: , , , , , , ,

Friday 12 January 2024

కీలకమార్పు దిశగా ఏపీ రాజకీయాలు!


 

కొలువుల భర్తీకి లైన్‌క్లియర్‌





 

సామాజిక కేంద్రమైన బడి సజీవంగా ఉండాలె


 

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ప్రతిష్ఠంభన


 

సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించిన పార్టీలు


 

సర్దుకుపోదాం రండి!



 

బీజేపీ 'ఆపరేషన్‌ సౌత్‌ స్టేట్స్‌'