"ఢిల్లీలోని మైనారిటీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదు" అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు.ఆదివారం నాడు తమిళనాడులోని క్రిష్ణగిరిలో మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు విభేదాలు రావడాన్ని విమర్శిస్తూ.. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టాలు వాటిల్లాయి. "ఒకరోజు, తమిళనాడుకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుంది" అని కూడా స్టాలిన్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనప్పటికీ, 543 మంది సభ్యులు ఉన్న లోక్సభలో 240 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. తెలుగు దేశం, జనతా దళ్ (యునైటెడ్) వంటి మిత్ర పక్షాల సహాయంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.
స్టాలిన్ తన అధికార పర్యటనలో లబ్ధిదారులకు సంక్షేమ సహాయాన్ని పంపిణీ చేసి, చెన్నైలోని తన ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
"మా మంత్రులు తంగం తెన్నరసు, గోవి. చెళియన్, ఎస్.ఎస్. శివశంకర్ చెన్నైలో ఒక విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు, డీఎంకే ఇచ్చిన 505 ఎన్నికల హామీలలో 364 నెరవేర్చబడ్డాయి. మరో 40 హామీలు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఇవి కాకుండా, 37 పథకాలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. 64 పథకాలు ఆర్థిక పరిమితుల కారణంగా అమలు చేయబడలేదు" అని ఆయన అన్నారు.
No comments:
Post a Comment