తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్
మ్యాప్లతో రమన్నాడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి దిగ్విజయ్
సింగ్. ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ముందు రెండే ఆప్షన్లు
ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రెండోది సమైక్యాంధ్రాను కొనసాగిం
చడం. ఈ రెండు వాదనల్లో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని వారి అభిప్రా యాలు ఆ
పార్టీ రాష్ట్ర పెద్దలకు చెప్పుకునే అవకాశం కార్య కర్త మొదలు ఎమ్మెల్యేలు,
ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉన్న ది. వీరందరి అభిప్రాయాలను
పరిగణలోకి హస్తినకు వెళ్తారు. అయితే రాష్ట్ర విభజనపై మాట్లాడుతున్న రాష్ట్ర
కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఎన్నోమార్లు వివిధ కమిటీల ముందు, కాంగ్రెస్
అధిష్టాన పెద్దల ముందు వినిపించారు. మొన్న దిగ్విజయ్ వచ్చినప్పుడు కూడ
ఇరుప్రాంతాల నుంచి తమ తమ అభిప్రాయాలతో కూడిన నివేదికలు ఇచ్చారు. అలాగే
అందరి అభిప్రాయాలు అధిష్టాన పెద్దలకు విన్నవించి, రాష్ట్ర విభజనపై అన్ని
ప్రాంతాల మనోభా వాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందరికి ఆమోదయో గ్యమైన
నిర్ణయం కేంద్ర ప్రభుత్యం తీసుకుంటుందని ఇప్పుడు విభజనపై మడత మాటలు
మాట్లాడుతున్న నేతలంతా ఇంతకాలం చెప్పుకొచ్చినవే. ఈ రాష్ట్ర ఎప్పటికీ
సమైక్యంగానే ఉంటుంది. ఎప్పు డు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదానికి 270
స్థానాలు ఖాయమన్న లగడపాటి రాజగోపాల్ దాన్ని పక్కనపెట్టాడు. తనకున్న
సమాచారం మేరకు మూడు నెలల్లో తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం
కోరుతారని, అప్పుడు ఆ తీర్మానం వీరిపో యేలా చేయాలన్నారు. ఆ తీర్మానం
వీరిపోతుందా లేక పాస్ అవుతుందా అనేది ఆంధ్రా ఆక్టోపస్కు అర్థం కావడం
లేదు. అందుకే అప్పుడు ఆ తీర్మానం వీరిపోవాడానికి నలభైపైచిలుకు ఉన్న
సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యవాదంపై గళం విప్పాలం టున్నాడు. తెలుగుతల్లి
ముక్కలు కాకుండా ఉండాలంటే వాళ్లు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుందని తెగ
ఆందోళనపడుతున్నాడు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర కాంగ్రెస్,
టీడీపీ, వైఎస్ఆర్సీపీలకు అధికార ప్రతినిధి అయిపోయాడు. అయా పార్టీల
నేతలంతా తెలంగాణను వ్యతిరేకించాలంటున్నాడు. ఇంతకాలం రాష్ట్ర విభజన ఎట్టి
పరిస్థితిలో జరగదన్న అగడపాటి ఇప్పుడు మా త్రం ఏం జరుగుతుందో చెప్పలేము
అంటున్నాడు. దానిపై ఆయ నకు క్లారిటీ రావాలంటే అసెంబ్లీ తీర్మానం తర్వాత
వస్తుందేమో! ఇక్కడే అగడపాటి రాజగోపాల్ ఒక విషయాన్ని మరిచిపోతున్నాడు.
రాష్ట్ర విభజనపై వ్యక్తిగత అభిప్రా యాలు ఏవైన పార్టీల అభిప్రా యాలే అంతిమం
అన్న ప్రాథమిక విషయాన్ని ఆయన మరిచిప తున్నాడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే
తెలంగాణకు తాము వ్యతిరే కం కాదు అన్న పార్టీల బలబలా లు చూస్తే ఆ బిల్లు
సునాయసంగా పాస్ అవుతుంది. లేదు ఆ మాట అన్నది తమ రాజకీయ లబ్ధి కోసమే అంటే
పరిస్థితి మరోలా ఉంటుంది. ఇప్పుడు పక్క పార్టీల విషయాన్ని పక్కనపెడితే మీ
ముఖ్య మంత్రి, పీసీసీ, డెప్యూటీ సీఎం రోడ్ మ్యాప్ల ఆధారంగా కాంగ్రెస్
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో అమలు చేయాల్సిన బాధ్యత
సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమ అభిప్రాయాన్ని తెలియజేసి మిగతా
పార్టీల అభిప్రాయాన్ని కోరవలసి ఉంటుంది. అంతేగానీ బడిత ఉన్న వాడిదే బర్రె
అన్నట్టు సీమాంధ్ర ప్రాంతంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి పార్టీ
నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తామంటే తీర్మానం వీగిపోతుందేమో కానీ
రాష్ట్ర విభజన మాత్రం ఆగదు. మెజరిటీ ప్రాంత ప్రతినిధులు తమకున్న బలంతో
మైనరిటీ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుంటామంటే కుదరదు. ఇలాంటి పరిస్థితి
ఉంటుం దనే రాజ్యాంగ నిర్మాతలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం
చేతిలో పెట్టారు. అందుకే మీ రాష్ట్ర వ్యవహారల పర్యవేక్ష కుడు దిగ్విజయ్
సింగ్ కూడా అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండా ల్సిన పనిలేదు అన్నారు.
రాష్ట్రాన్ని విడదీస్తే రాజీనామాలు చేస్తాం. అగ్నిగుండం అవుతుంది అనే
మాటలతో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలకు కాలం
చెల్లింది. తెలంగాణ కోసం ఆ మధ్య కొంతమంది ఎంపీలు పార్టీకి డెడ్లైన్లు
పెడితే, అధిష్టానానికి డెడ్లైన్లు పెట్టే సాహసం ఎవరూ చేయకూడదని
ముఖ్యమంత్రి అన్న మాటలు రాజీనామాలు చేస్తాం అంటున్నవారు గుర్తించుకుంటే
మంచిది. టీడీపీ, వైఎస్ఆర్సీపీలు కూడా తెలంగా ణపై కేంద్ర ప్రభుత్వమే
నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి. కాంగ్రెస్ హస్తిన పెద్దలు మొదలు
ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి దాకా కేంద్రం దీనిపై చర్చలు జరుపుతున్నదని
త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ నిర్ణయానికి అనేక గడువులు
పెట్టి మాట మార్చారు కూడా. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. అందుకే
డిగ్గీరాజా ఒక డెడ్లైన్లు ఉందవు నిర్ణయమే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ
మాట నిజమో కాదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసుందామని ఆంధ్రప్రదేశ్ లోని
బుద్ధిజీవులంతా కోరుకుంటున్నారు. అయితే నిర్ణయం రాకము ందే ఒక ప్రాంత ప్రజలు
ఆకాంక్షపై ఒక వర్గం మీడియా, కొంత మంది వ్యక్తులు విషం చిమ్మడం సరికాదు.
అలాగే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టేవరకూ కాంగ్రెస్ను నమ్మేస్థితిలో
ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ అన్నమాట ప్రకారం పార్లమెంట్లో బిల్లు
పెడితేనే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజల నాలుగు
దశాబ్దాల కల సాకారమవుతుందనుకున్న ప్రతి తరుణంలో ఒక వర్గం మీడియా
అడ్డుకోజూడటం ఇక్కడి ప్రజల్లో పెను ప్రభావమే చూపుతుంది. తెలంగాణపై పార్టీల
నిర్ణయమే ప్రామాణికం. ఆయా పార్టీలు ఇక్కడ మన గలగాలంటే ఇప్పుడు అవి తీసుకునే
నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే
https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h https://youtube....

-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...
No comments:
Post a Comment