ఏపీలో విన్నింగ్ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కలిసి పోటీచేయనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్నే కాదు ఆ కూటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్ వాళ్ల వైఫల్యాలకు బీఆర్ఎస్ను, కేసీఆర్ ను నిందిస్తున్నది. గోదావరి, కృష్ణ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్నా దానికీ కారణం కేసీఆర్ అని అంటున్నది. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా రాష్ట్రంలో బలం లేని ఏపీ కూటమికి బాటలు వేస్తున్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాతలు రాస్తున్న ఓ వర్గం మీడియా రాహుల్ గాంధీపైనా విమర్శలు చేస్తున్నది. రేవంత్ రెడ్డికి ఆయన స్వేచ్ఛ ఇవ్వడం లేదని రాతలు రాస్తున్నారు. ఈ విషయాన్ని మరిచి తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కే ఒక వర్గం మీడియాకు బీజేపీతో పోటీ పడి కాంగ్రెస్ మంత్రులు, నేతలు వంతపాడితే రానున్న రోజుల్లో దాని ఫలితం అనుభవిస్తారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరి వచ్చేసరికి కూటమి పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలన్నది చెప్పాలంటే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాల్సిందే. ఆ పని వాళ్లు చేస్తే అంతకు మించి రాతలు రాయడానికి ఇప్పుడు వెనకేసుకు వస్తున్న ఒక వర్గం మీడియా ఉండనే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రయోజనం ఉండదు అన్న విషయాన్ని గుర్తించుకుంటే మంచిది.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
No comments:
Post a Comment