Wednesday, 30 July 2025

రేపే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే తుది తీర్పు



బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనున్నది. సీజేఐ ధర్మాసనం రేపు తుది తీర్పు వెల్లడించనున్నది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వ్యాఖ్యానించడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం స్పీకర్‌ పరిధిలో ఉన్నప్పటికీ సభ గడువు ముగిసే వరకు స్పీకర్‌ మౌనంగా ఉంటే కూర్చు ఊరుకోబోమని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ టేబుల్‌ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఎమ్మెల్యేల  ఫిరాయింపులపై అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో చాలా కాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం రేపు తుది తీర్పు వెల్లడించనున్నది. 



https://www.ntnews.com/telangana/telangana-hc-verdict-on-mlas-who-defected-from-the-party-1722572 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...