Tuesday, 11 November 2025

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ ...ఆరుగురు మావోయిస్టులు మృతి




ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మోడక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుల్‌నార్ గ్రామానికి ఆరు కిలోమీటర్ల పశ్చిమాన ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (ఎస్‌ఎఫ్), మావోయిస్టుల మధ్య  ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, మృతుల వివరాలను ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇతర మావోయిస్టుల జాడ కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో మృతదేహాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ పోలీసులు తెలిపారు. జిల్లాలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాల బృందాలు చురుకుగా పాల్గొంటున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...