హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజినీర్లను బదిలీ చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్వోసీల జారీలో ఆరోపణలు, క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. బదిలీ అయిన వారిలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలోనే 60 మందికి పైగా ఇంజినీర్లను బదిలీ చేయడం గమనార్హం.

No comments:
Post a Comment