జనవాక్కు: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదో నిందితుడు సఫీక్ను అతని సోదరి రోజినా సమాచారంతో అందాల్ వంతెన వద్ద పట్టుకున్నారు. తన సోదరుడు చేసిన నేరానికి శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో సమాచారం ఇచ్చినట్లు రోజినా తెలిపింది.బాధితురాలు తన భయానక అనుభవాన్ని వివరిస్తూ, శుక్రవారం రాత్రి స్నేహితుడితో బయటకు వెళ్లగా, దుండగులు వెంబడించారని, అడవిలోకి పరిగెత్తినప్పుడు తన స్నేహితుడు వేరే దారిలో వెళ్లగా, నిందితులు తనను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది. నిందితులు ఫోన్ లాక్కొని, స్నేహితుడిని పిలవమని బెదిరించారని, అతడు రాకపోవడంతో దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. పోలీసులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment