జనవాక్కు: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదో నిందితుడు సఫీక్ను అతని సోదరి రోజినా సమాచారంతో అందాల్ వంతెన వద్ద పట్టుకున్నారు. తన సోదరుడు చేసిన నేరానికి శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో సమాచారం ఇచ్చినట్లు రోజినా తెలిపింది.బాధితురాలు తన భయానక అనుభవాన్ని వివరిస్తూ, శుక్రవారం రాత్రి స్నేహితుడితో బయటకు వెళ్లగా, దుండగులు వెంబడించారని, అడవిలోకి పరిగెత్తినప్పుడు తన స్నేహితుడు వేరే దారిలో వెళ్లగా, నిందితులు తనను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది. నిందితులు ఫోన్ లాక్కొని, స్నేహితుడిని పిలవమని బెదిరించారని, అతడు రాకపోవడంతో దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. పోలీసులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
దూరదర్శన్ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత
న్యూఢిల్లీ: దూరదర్శన్ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

No comments:
Post a Comment