సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ నుమట్టికరిపించిన టీమిండియా.. ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో కొండంత లక్ష్యాన్ని (339) ఛేదించి.., సౌతాఫ్రికాతో తుదిపోరుకు సిద్ధమైంది. టోర్నీలో ప్రారంభంలో తడబాటుకు గురైనా.. తర్వాత తేరుకొని.. ఆఖరుకు ఫైనల్కు చేరుకున్న టీమిండియా ప్రస్థానం థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్నది. ఇక క్లైమాక్స్లో కప్ కొట్టి.. శుభం కార్డు వేయడమే తరువాయి.
ఉత్సాహంతో ఒకరు.. ఆనందంతో మరొకరు!
మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (నవంబరు 2) నవీముంబయి వేదికగా జరగనుంది. తుదిపోరులో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీఫైనల్లో ఆసీస్ను ఓడించిన ఉత్సాహంతో టీమిండియా.. ఇంగ్లాండ్పై 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఆనందంలో సౌతాఫ్రికా ఫైనల్లోకి అడుగుపెట్టాయి. అయితే ఈ రెండు జట్లలో ఏది గెలిచినా.. ఆ టీమ్ తొలిసారి వన్డే వరల్డ్కప్ను కైవసం చేసుకున్నట్లవుతుంది.
టీమిండియాదే పై చేయి!
టీమిండియా, సౌతాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. టీమిండియా 20 సార్లు విజయం సాధిస్తే, సౌతాఫ్రికా 13 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. అయితే.. ప్రస్తుత వరల్డ్ కప్లో (2025) అక్టోబర్ 9న విశాఖపట్నం వేదికగా ఇరుజట్లకు జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా జట్టు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
No comments:
Post a Comment