భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోడీ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించిన మోదీ.. అనంతరం వారికి సెల్యూట్ చేశారు. సాయుధ దళాలు, స్థానికులతో కలిపి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్, జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్, మణిపుర్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
No comments:
Post a Comment