Tuesday, 28 October 2025

అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు సిద్ధం: మిచెల్ మార్ష్




జనవాక్కు: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ చెప్పాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ రేపు (అక్టోబర్ 29) కాన్బెర్రాలో జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మార్ష్ మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ అద్భుత నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ధనాధన్ ఆడాడు. అతడు మాకు నిజమైన ఛాలెంజ్. అయినా మేం అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’ అని అన్నాడు.జోష్ ఇంగ్లిస్ ఫిట్‌గా ఉన్నాడని, సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడని మార్ష్ తెలిపాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయం కారణంగా దూరమైన ఇంగ్లిస్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని, జట్టుకు కీలకమని వివరించాడు.

No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...