Tuesday, 28 October 2025

అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు సిద్ధం: మిచెల్ మార్ష్




జనవాక్కు: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ చెప్పాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ రేపు (అక్టోబర్ 29) కాన్బెర్రాలో జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మార్ష్ మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ అద్భుత నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ధనాధన్ ఆడాడు. అతడు మాకు నిజమైన ఛాలెంజ్. అయినా మేం అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’ అని అన్నాడు.జోష్ ఇంగ్లిస్ ఫిట్‌గా ఉన్నాడని, సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడని మార్ష్ తెలిపాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయం కారణంగా దూరమైన ఇంగ్లిస్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని, జట్టుకు కీలకమని వివరించాడు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...